అన్వేషించండి

Chittoor News: చిత్తూరు జిల్లాలో విషాదం... స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు

చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. కొండి కర్రలతో పడవ తయారు చేసి నదిలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. బాలురు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు అయ్యారు.  రేణిగుంట మండలం జి.పాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు బాలురు ఆదివారం ఉదయం స్వర్ణముఖి నదిలో కొండి కర్రలతో పడవ తయారు చేసి ప్రయాణం సాగించారు. అయితే ఒక్కసారిగా పడవ మునిగి పోవడంతో ముగ్గురు నదిలో కొట్టుకుని పోగా.. ఒక్కరు బయటపడ్డారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోనికి దిగిన పోలీసులు ముగ్గురు బాలురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలురు మునిగిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని రోధిస్తున్నారు. 

Also Read: చోరీ కేసుపై సీపీ ప్రెస్ మీట్.. పోలీసులు, విలేకరుల ముందే నిందితుడు రచ్చ రచ్చ, భార్య గురించి గట్టిగా అరుస్తూ..

 ఆదివారం సెలవు కావడంతో నలుగురు చిన్నారులు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. నదిలో చేపలు పట్టేందుకు కొండి కర్రలతో ఓ పడవ చేసుకున్నారు. నలుగురు చిన్నారులు కలిసి పడవపై నదిలో కొంత దూరం ప్రయాణించారు. ఆకస్మాత్తుగా పడవ నీటిలో మునిగిపోయింది. ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు కాపాడారు. మరో ముగ్గురిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాళ్యం వద్ద స్వర్ణముఖి నదిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read:  ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్

రేణిగుంట మండలం జి.పాళ్యం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నిక్షిత్, గణేష్, ధోని, యుగంధర్ స్వర్ణముఖి నదిలో గల్లంతయ్యారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ నలుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు నది వద్దకు వెళ్లారు. గ్రామానికి సమీపంలో స్వర్ణముఖి నది వంక ప్రవహిస్తోంది. ఇటీవల వర్షాలకు నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. నదిలో దిగిన విద్యార్థులు లోతు అంచనా వేయలేక ప్రవాహానికి కొట్టుకుపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న నిక్షిత్ అనే విద్యార్థిని స్థానికులు కాపాడారు. మిగతా ముగ్గురు గణేష్, ధోని, యుగంధర్ గల్లంతవ్వడంతో వారి ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెతుకుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: 

టాప్ హెడ్ లైన్స్

Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget