అన్వేషించండి

Chittoor Crime News : ఇన్ స్టాలో పరిచయం ప్రేమగా, దుబాయ్ నుంచి చిత్తూరుకు- బ్యూటీషియన్ హత్య కేసులో వీడిన మిస్టరీ

Chittoor Crime News : చిత్తూరులో బ్యూటీషియన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలిపై అనుమానంతోనే ప్రియుడే దారుణానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. ే

Chittoor Crime News : చిత్తూరులో బ్యూటీషియన్ హత్య కేసు రాష్ట్ర ‌వ్యాప్తంగా సంచళనంగా మారిన విషయం తెలిసిందే. ఈ‌ కేసులో ఎట్టకేలకు పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ నెల 18వ తేదీన కొండమిట్టలో బ్యూటీ పార్లర్ లో దుర్గా ప్రశాంతిని హత్య చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన చక్రవర్తిని తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద పోలీసులు అదుపులో‌ తీసుకుని రిమాండ్ కు తరలించారు.  

అసలేం జరిగింది?           

చిత్తూరు దిశా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు కొండమిట్టలో గ్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న దుర్గాప్రశాంతికి గత ఏడాది అక్టోబర్ లో ఇన్ స్టా గ్రామ్ ద్వారా దుబాయిలో ఉండే చక్రవర్తి అనే వంట మాస్టర్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతను దుర్గాప్రశాంతితో చాటింగ్ చేస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రశాంతి అంటే ఇష్టం పెంచుకున్న చక్రవర్తి తనని పెళ్లి చేసుకోమని కోరాడు. అయితే అందుకు చిత్తూరుకు వచ్చి ఇక్కడే ఉంటే, తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చని దుర్గా ప్రశాంతి చెప్పింది. ఎలాగైనా ప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో ఫిబ్రవరి 6వ తేదీన చక్రవర్తి దుబాయ్ నుంచి నేరుగా చెన్నైలో దిగితే ప్రశాంతి చెన్నై వెళ్లి చక్రవర్తిని చిత్తూరుకు పిలుచుకొని వచ్చింది. చక్రవర్తి చిత్తూరులో ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించి, తన తల్లిని కూడా చిత్తూరుకు పిలిపించుకున్నాడు. చిత్తూరులో చక్రవర్తి తరచుగా ప్రశాంతిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రశాంతి చక్రవర్తిని, అతని అమ్మని తన అమ్మ ఇందిరాకి కూడా పరిచయం చేసింది. అయితే ఈ మధ్యలో ప్రశాంతి తనని పట్టించుకోకుండా వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉంటోందని, తనకి అబద్దం చెప్పి వేరే ఊరికి ఆ వ్యక్తితో వెళ్లిందని, ప్రశాంతి తన ఫోన్ ని స్విచాఫ్ చేయడంతో చక్రవర్తికి అనుమానం పెరిగి ఆమె కదలికలపై నిఘా పెట్టాడు. అయితే ఏప్రిల్ 17వ తేదీ రాత్రి ప్రశాంతి కోసం రైల్వే స్టేషన్లో కాపు కాశాడు చక్రవర్తి. ఆమె ట్రైన్లో నుంచి దిగి ఇంటికి వెళ్లాక రైల్వే స్టేషన్ దగ్గర ప్రశాంతితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో చక్రవర్తి గొడవ పడ్డాడు. ఇది తెలుసుకున్న ప్రశాంతి చక్రవర్తితో ఫోన్లో బాగా గొడవపడి, అతనికి తను అనుకున్నట్టుగా ఏంలేదని, అంతగా అనుమానించే వ్యక్తితో తను భవిష్యత్తులో ఉండలేనని, ఇంట్లో వాళ్లు కూడా రోడ్డుపైన అమ్లెట్లు  వేసుకొనే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోరని కనుక అతను తన దారి తను చూసుకోవచ్చనీ,  ఫోన్లో తనతో ఉన్న చాటింగ్ అంతా తొలగించాలని ప్రశాంతి చెప్పింది. 

తననే ప్రేమించాలని దాడి 

దీంతో చక్రవర్తి దుర్గాప్రశాంతిపై ద్వేషం పెంచుకొని, బతికితే కలిసే బతకాలని, లేకపోతే కలిసే చావాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రశాంతి నమ్మించి తనను మోసం చేసిందని, తను బతకాల్సిన అవసరం లేదని తన ఫోన్ లో ఒక సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఒంటరిగా ఉన్న దుర్గాప్రశాంతితో తన ప్రేమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని, తన కోసం అన్నీ వదులుకొని దుబాయ్ నుంచి వస్తే తనను పూర్తిగా పక్కన పెట్టేసిందని, తననే ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని గొడవ చేశాడు. వాదన ముదిరి, చక్రవర్తి విచక్షణ కోల్పోయి ప్రశాంతిపై దాడి చేసి చేశాడు. అతడు కూడా బ్లేడ్ తో చేతుల మీద, మణికట్టుల మీద కోసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో చక్రవర్తి రక్తం ఒక్కసారిగా చిమ్మి తన మీద పడడంతో ప్రశాంతి ఊపిరాడక భయాందోళనతో కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని భావించి చక్రవర్తి తన గొంతు కూడా రెండు చోట్ల కోసుకొని రక్తస్రావంతో తను కూడ అపస్మారక స్థితిలో కూలిపోయాడు. 4 గంటలప్పుడు రక్తపు మడుగులో వాళ్లను చూసిన ప్రశాంతి అమ్మ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కొనప్రాణంతో ఉన్న చక్రవర్తిని, ప్రశాంతిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ప్రశాంతి అప్పటికే చనిపోయినట్టుగా ప్రకటించిన వైద్యులు, చక్రవర్తిని మెరుగైన వైద్యం నిమిత్తం తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. ప్రశాంతి తండ్రి హెడ్ కానిస్టేబుల్ నాగరాజు ఫిర్యాదు మేరకు చక్రవర్తిపై హత్య, ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు... దిశా డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ చేపట్టారు. సాక్ష్యులను విచారించి ఆధారాలు సేకరించి, ఏప్రిల్ 26వ తేదీ చక్రవర్తిని తిరుపతి రూయ ఆసుపత్రి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget