Andhra Pradesh Accident: పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్ను ఢీకొట్టి 3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
Palnadu Accident: పల్నాడులో ఓ బోలెరో వాహనం స్కూటర్ను ఢీకొట్టి మూడు కిలోమీటర్లు లాక్కెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Bolero vehicle collided with a scooter dragged it ౩ kilometers : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్ అయ్యాయి. బోలెరో వాహనం ఓ స్కూటర్ను ఢీకొట్టి దాన్ని సుమారు 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లిపోయింది. ఈ ఘటన రాత్రి సమయంలో జరిగింది. స్థానికులు మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ హై స్పీడ్లో వాహనం నడుపుతూ స్కూటర్ను ఢీకొట్టిన విషయం కూడా పట్టించుకోలేదు. అతి కష్టం మీద స్థానికులే ఆ కారును ఆపారు.
పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద బైపాస్ రోడ్ పై ఈ ఘటన జరిగింది. బైపాస్ లో నిప్పు రవ్వల తోటి స్కూటర్ ను లాక్కెళ్లడంతో అందరూ భయపడ్డారు. బోలెరో నడుపుతున్న వ్యక్తి మద్యం తాగినట్లుగా గుర్తించారు.
బోలెరో వాహనం హై స్పీడ్లో వస్తూ స్కూటర్పై ఢిల్లీకొట్టింది. స్కూటర్ బోలెరో టైరుకు ఇరుక్కుపోయింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లాడు. స్కూటర్ను 3 కిలోమీటర్ల దూరం లాగి తీసుకెళ్లాడు. వాహనం రోడ్డుకురాసుకుని నిప్పులు వచ్చాయి. రోడ్డు మీద ఉన్న వాహనదారులు, స్థానికులు వాహనాన్ని ఆపడానికి చాలా కష్టపడ్డారు. డ్రైవర్ మొదట ఆపలేదు, కానీ వారి పట్టుదలతో చివరికి వాహనాన్ని ఆపేశారు. స్కూటర్ పూర్తిగా దెబ్బతిని, నాశనం అయింది. స్కూటర్ యజమాని లేదా డ్రైవర్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. గాయాలు గురించి ఇంకా సమాచారం లేదు.
View this post on Instagram
ఈ ఘటనను రోడ్డు మీద ఉన్న ఓ వాహనదారు మొబైల్తో రికార్డ్ చేశాడు. వీడియోలో బోలెరో హై స్పీడ్లో స్కూటర్ను లాగి తీసుకెళ్తుండటం, రోడ్డు మీద నిప్పురవ్వలు రావడం స్పష్టంగా కనిపిస్తాయి.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్ చల్..
— Tolivelugu Official (@Tolivelugu) October 1, 2025
బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు వద్ద స్కూటీ నీ ఈడ్చుకు వెళ్లిన బొల్లారా కారు, బైపాస్ లో నిప్పు రవ్వల తోటి వాహనదారులను భయభ్రాంతులను గురిచేస్తున్న యువకుడు . pic.twitter.com/Bpo01IqZUW
పల్నాడు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వాహన డ్రైవర్ హై స్పీడ్లో నడుపుతూ రిక్కలెస్ డ్రైవింగ్ చేసినట్లు అనుమానం. గాయాలు లేదా మరణాలు జరగలేదని తెలిసినప్పటికీ, స్కూటర్ యజమాని గురించి ఇంకా సమాచారం లేదు. పోలీస్ సూపరింటెండెంట్ "ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్డు భద్రతను మరింత పెంచుతాం" అని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారాయి. గతేడాది 15,000కి పైగా ప్రమాదాలు జరిగి, 6,000 మంది మరణించారు. హై స్పీడ్, రిక్కలెస్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు. ఈ ఘటన వంటివి ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ క్యాంపెయిన్లు నడుపుతున్నారు.





















