అన్వేషించండి

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

Bapatla Road Accident: బాపటల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. అలాగే 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు అయ్యప్ప మాల వేసుకున్న దీక్షపరులు దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లాకు చెందిన స్వాములు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్దకు రాగానే ఆదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు స్వాములు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానిక ప్రజలు.. స్వాములను బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. 


Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

మూడ్రోజుల క్రితం కాకినాడలో - ముగ్గురు సజీవ దహనం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ధర్మవరం జాతీయ రహదారిపై ఉన్న హెచ్.పి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎర్రవరం నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోన్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తోన్న మరొక లారీని ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో లారీ క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు లారీలలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. రెండు లారీలు ఢీకొనడంతో క్యాబిన్ లోంచి చెలరేగిన మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. 

అసలేం జరిగింది? 

కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా లారీల క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఘటనాస్థలిలో సజీవ దహనం అయ్యారు. మరొకరిని ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోన్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. రెండు లారీలు వేగంగా ఒకదానిని మరొకటి ఢీకొట్టడంతో ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో కొద్దిసేపు జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  

పలమనేరులో బస్సు ప్రమాదం 

 చిత్తూరు జిల్లాలో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. హెచ్‌బీ ట్రావెల్స్‌ బస్సు  పలమనేరు సమీపంలోని కెట్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత బోల్తా పడింది.  బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేసి మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget