అన్వేషించండి

Crime News: ఏపీలో దారుణాలు - సెల్ ఫోన్ దొంగిలించారన్న అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి, మరో చోట ప్రాణం మీదకు తెచ్చిన పందెం

Andhra News: ఏపీలో వేర్వేరు చోట్ల దారుణాలు జరిగాయి. ఓ చోట సెల్ ఫోన్ తీశారనే అనుమానంతో దంపతులపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేయగా..మరోచోట రూ.2 వేల కోసం ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు.

Attack On Couple With Machete In Annamayya District: ఏపీలో వేర్వేరు చోట్ల దారుణాలు చోటు చేసుకున్నాయి. సెల్ ఫోన్ దొంగిలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అటు, ఎన్టీఆర్ జిల్లాలో రూ.2 వేల పందెం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) మదనపల్లె మండలం చీకలబయలు పంచాయతీ, జోలపేటకు చెందిన నారాయణ, విజయమ్మ నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న వసంత్ అనే వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. అయితే, ఆ దంపతులపై అనుమానం ఉన్న వసంత్ మంగళవారం ఉదయం నుంచి వారిని దూషించడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన నారాయణ, విజయమ్మ వసంత్‌ను నిలదీశారు.

కొడవలితో దాడి

దీంతో ఆగ్రహించిన వసంత్.. సెల్ ఫోన్ మీరే ఎత్తుకుపోయారంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి సహనం కోల్పోయిన వసంత్.. కొడవలితో నారాయణ, విజయమ్మపై దాడికి దిగాడు. ఈ ఘటనలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో బాధితులను కలిసి ఘటనపై ఆరా తీశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో..

మద్యం మత్తులో ఇద్దరు యువకులు వేసుకున్న పందెం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామలో గోపీచంద్ అనే యువకుడు రూ.2 వేల కోసం వాగులో దూకి అదృశ్యమయ్యాడు. రోశయ్య అనే మరో యువకుడితో కలిసి పందెం కాశాడు. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకి.. ఎవరు ముందు ఒడ్డుకు చేరితే వారు డబ్బులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మున్నేరు వాగులోకి ఇద్దరు యువకులు దూకగా.. రోశయ్య ఒడ్డుకు చేరాడు. కానీ, గోపీచంద్ అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోపీచంద్ కోసం వెతికారు. ఎంతలా వెతికినా ఫలితం లేకపోయింది. మద్యం మత్తులోనే ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను చంపేసిన భర్త

అటు, నెల్లూరు జిల్లాలో (Nellore District) దారుణం జరిగింది. సైదాపురం మండలం గంగదేవిపల్లిలో కుటుంబ కలహాలతో లావణ్య (29) అనే వివాహితను ఆమె భర్త మునేంద్ర దారుణంగా హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget