అన్వేషించండి

Meerpet Murder : మీర్ పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ - హత్య చేసింది గురుమూర్తి ఒక్కడే కాదు - మరో ముగ్గురు నిందితులు

Meerpet Murder : మీర్ పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని భర్త గురుమూర్తి ఒక్కడే కాదు మరో ముగ్గురి సహకారంతో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

Meerpet Murder : తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీర్ పేట మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకట మాధవిను హత్య చేసింది కేవలం ఆమె భర్త గురుమూర్తి ఒక్కడే కాదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో గురుమూర్తితో పాటు మరో ముగ్గురి ప్రమేయం కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ మర్డర్ మిస్టరీలో గురుమూర్తికి ఇద్దరితో పాటు మరో ప్రమేళ కూడా సహకరించినట్టు పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట హత్యకు ముందు అసలేం జరిగింది, ఎందుకు తన భర్తే హత్యకు పాల్పడ్డాడు అన్న విషయానికొస్తే.. జనవరి 18వ తేదీన తన కూతురు వెంకట మాధవి తప్పిపోయిందని ఓ మహిళ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవి తన  భర్త గురుమూర్తితో కలిసి జిల్లెలగూడ గ్రామంలో నివసిస్తోంది. అయితే జనవరి 16న వారిద్దరి మధ్య గొడవ కావడంతో ఎవరికీ ఏం చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. జనవరి 15న నిందితుడు గురుమూర్తి, వెంకట మాధవితో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత మాధవి మళ్లీ బయటికి వచ్చినట్టు కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం గురుమూర్తి తన భార్యను ఇంట్లోనే హత్య చేసి ఉంటాడని అప్పట్లో పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ తర్వాత తీవ్ర విచారణ తర్వాత గురుమూర్తి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. జనవరి 14న బడంగ్ పేటలోని తన అఖ్క సుజాత వాళ్ల ఇంట్లో సంక్రాంతి పండుగకు గురుమూర్తి తన భార్య, పిల్లలను వదిలి, మళ్లీ జిల్లెలగూడకు చేరుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ బడంగ్ పేటలోని సోదరి ఇంటికి వెళ్లి వచ్చాడు. కానీ పిల్లల్ని అక్కడే ఉంచి వచ్చారు. జనవరి 16న ఉ.8 గంటలకు ఇద్దరి మధ్య గొడవ ముదిరి.. అది చివరికి మాధవిని హత్య చేసే వరకు వెళ్లింది. ఆమెను గట్టిగా కొట్టడంతో మాధవి తల గోడకు తగిలి కుప్పకూలింది. ఆ తర్వాత భార్య గొంతుకోసి చంపి, దాన్ని కప్పిపుచ్చాలనుకున్నాడు. శవాన్ని మాయం చేసేందుకు మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అందర్నీ నమ్మించాడు.

ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి, వాటర్ హీటర్ తో వాటిని ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని గ్యాస్ స్టవ్ పై కాల్చాడు. అనంతరం స్టోన్ రోలర్ తో ఎముకలను నలిపి, టాయిలెట్ లో వేసి ప్లష్ చేశాడు. మిగిలిన ఎముకలను డస్ట్ బిన్ లో వేసి పడేయాలనుకున్నాడు. ఎవరికీ దుర్వాసన రాకుండా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాడు. ఈ మొత్తం ప్రాసెస్ ను గురుమూర్తి ఉ.10 నుంచి సా.6 గంటల వరకు అంటే 8 గంటలు పట్టింది. ఆ తర్వాత బాత్రూమ్ ను శుభ్రంగా కడిగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఇంత అమానవీయంగా భార్యను హత్య చేసినప్పటికీ గురుమూర్తిలో ఎలాంటి పశ్తాత్తాపం లేకపోవడం గమనార్హం. తల్లి కనిపించడం లేదని పిల్లలు అడిగితే ఎక్కడికో వెళ్లిందని చెప్పాడు. ఆమె గురించి తెలిస్తే ఎవరికైనా చెప్తారని వాళ్లను సోదరి ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు మరొకసారి తల్లి గురించి ఆరా తీయడంతో.. ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆర్మీలో 15ఏళ్లు పని చేసిన గురుమూర్తి పక్కా ప్లాన్ ప్రకారం, భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడుపయోగించిన మొత్తం 16 వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. 

Also Read : Telangana Schemes: అభివృద్ధి దిశగా సాగుతోన్న తెలంగాణలో అమలవుతోన్న పథకాలివే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Embed widget