అన్వేషించండి

Phone Tapping Case నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు

Telangana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 8 మందిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

Taskforce former DCP Radhakishan Rao: హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు (Phone Tapping Case)లో నిందితుడు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు 386, 365, 341, 120బి రెడ్‌ విత్‌ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. బిజినెస్ మ్యాన్ చెన్నుపాటి వేణు మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజా కేసు నమోదైంది. గతంలో ఓ వ్యక్తి తన కంపెనీలో కొన్ని షేర్లు కొని, చివరికి కంపెనీనే స్వాధీనం చేసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు సాయంతో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.

అసలేం జరిగిందంటే..
 చెన్నుపాటి వేణు మాధవ్ హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. క్రియా పేరుతో 2011లో హెల్త్‌ కేర్‌ సర్వీసు ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీలో 165 హెల్త్‌కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఖమ్మంలో టెలిమెడిసిన్‌, జాతీయ రహదారులపై ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసు వాహనాలు ఏర్పాటు చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెల్త్‌కేర్‌ సెంటర్ల ప్రాజెక్టు యూపీలో విస్తరించిన సమయంలో గోపాల్‌, రాజ్‌, నవీన్‌, రవిలను పార్ట్‌టైమ్‌ డైరెక్టర్లుగా నియమించి.... బాలాజీ అనే వ్యక్తిని సీఈవో పెట్టినట్లు వెల్లడించారు.

ఆపై చంద్రశేఖర్‌ వేగే అనే వ్యక్తి తమ కంపెనీల్లో షేర్లు కొనడంతో పాటు డైరెక్టర్లతో కుమ్మక్కై.. రూ.100 కోట్ల తన కంపెనీని లాక్కునే ప్రయత్నం చేశారని వేణు మాధవ్ ఆరోపించారు. బెదిరింపులకు లొంగకపోవడంతో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జున్‌ల సాయంతో తనను కిడ్నాప్‌ చేయించి డీసీపీ ఆఫీసులో హింసించారని తెలిపారు. చంద్రశేఖర్‌ వేగే చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని ఓ దశలో తనను బెదిరించినట్టు బాధిత వ్యాపారవేత్త వేణుమాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాకు విషయం చెప్పకూడదని హెచ్చరించారన్నారు. ఏం చేయాలో తెలియక సీఐ గట్టు మల్లు టీమ్‌కు తాను 10 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. గతంలో జరిగిన ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా.. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
Sumanth: సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
Embed widget