By: ABP Desam | Updated at : 08 Oct 2021 08:29 PM (IST)
అఫ్ఘనిస్థాన్లో ఆత్మాహుతి దాడి
అఫ్ఘనిస్థాన్ లో దారుణం జరిగింది. మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నార్త్ ప్రావిన్స్లో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తాలిబన్ పోలీసు అధికారులు వెల్లడించారు.
అఫ్గాన్లోని నార్త్ కుందుజ్ ప్రావిన్స్లో మసీదు లక్ష్యంగా దాడి జరిగినట్లు సమాచారం. షీతె ముస్లింలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం కావడంతో మసీదులో ఎక్కు మంది ఉంటారని, సరిగ్గా అదే సమయంలో ఆత్మాహుతి దాడి జరిపితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుందని ప్లాన్ వేశారు. మసీదులో ఉన్న వారిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. షీతె ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు గతంలోనూ దాడులు చేశారు.
Also Read: చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ, చొరబాటుకు యత్నం.. 200 మంది చైనా సైన్యాన్ని అడ్డగించిన భారత్
#UPDATE | At least 50 dead in Afghanistan's Kunduz mosque blast, as per hospital sources: AFP News Agency
— ANI (@ANI) October 8, 2021
ఈ ఏడాది ఆగస్టు చివర్లో అమెరికా మరియు నాటో సంయుక్త బలగాలు ఆఫ్ఘనిస్థాన్ ను వీడిన తరువాత జరిగిన అతి పెద్ద మిలిటెంట్ దాడి ఇది అని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం గోజర్ ఈ సయీద్ అబాద్ మసీదులో ప్రజలు అధికంగా ఉంటారని భావించి ఉగ్రదాడికి పాల్పడినట్లు అధికార ప్రతినిథి తెలిపారు. చూస్తుండగానే భారీ సమూహంలో బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షి అలీ రెజా తెలిపాడు. మొదట 100 మందికి పైగా చనిపోయారని కథనాలు రాగా, 50 మంది మరణించారని అధికారులు ప్రకటించారు.
ఆత్మాహుతి దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి బబీవుల్లా ముజాహిద్ స్పందించారు. షీతె ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ప్రార్థనలు చేస్తున్న సమయంలో అయితే ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని భావించి ఈ దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. తాలిబన్ స్పెషల్ ఫోర్సెస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఏ గ్రూప్ కూడా ఈ దాడి తమ చర్య అని ప్రకటించుకోలేదు. తాలిబన్ల పాలనలో అఫ్గాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విదేశాలకు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు.
Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు
దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు
Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్హోల్లో పడేసిన పూజారి- హైదరాబాద్లో దారుణం
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
France stabbing: ప్రీస్కూల్లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు
WTC Final 2023: అజింక్య అదుర్స్! WTC ఫైనల్లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !