అన్వేషించండి

Ganja Smuggling: పోలీసుల కళ్లుగప్పి ఏపీ నుంచి యూపీకి భారీ స్మగ్లింగ్.. 972 కేజీల గంజాయి సీజ్, ముగ్గురు నిందితుల అరెస్ట్

గత కొన్ని రోజులుగా ఏపీలో గంజాయి రవాణా, డ్రగ్స్ సరఫరా వివాదం నడుస్తుండగా ఏపీ నుంచి ఉత్తరాధిన యూపీకి తరలిస్తోన్న గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

(Vivek Tripathi/ABP News Network)
ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా డ్రగ్ స్మగర్లు మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ఓ తీరుగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇలా దేశమంతా గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రానికి తరలిస్తోన్న భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఏకంగా 972 కేజీల గంజాయి అక్రమ రవాణాను గుర్తించి, చాకచక్యంగా పట్టుకున్నారు. 

గత కొన్ని రోజులుగా ఏపీలో గంజాయి రవాణా, డ్రగ్స్ సరఫరా వివాదం నడుస్తుండగా ఏపీ నుంచి ఉత్తరాధిన యూపీకి తరలిస్తోన్న గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గంజాయి స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందుకున్న డీఆర్ఐ టీమ్ యూపీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ నుంచి ఓ ట్రక్కులో రహస్యంగా గంజాయి తరలిస్తుండగా లక్నో సమీపంలో డ్రగ్స్ సరఫరా ముఠాను గుర్తించారు. అనుమానం వచ్చి ట్రక్కును పరిశీలించగా మొదట్లో అందులో ఏమీ లేదని డీఆర్ఐ అధికారులు భావించారు. కానీ క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు షాక్ తిన్నారు. అందులో ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి తరలిస్తోన్న గంజాయిని గుర్తించారు. ట్రక్కులో గంజాయి తరలిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ట్రక్కును, 972 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

Also Read: ఆ హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదు... ఏపీ డీజీపీ కీలక ప్రకటన... వాస్తవాలు మాట్లాడాలని నేతలకు హితవు

ఏపీ నుంచి లక్నో.. వయా ప్రయాగ్ రాజ్..
ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ మొత్తంలో గంజాయి సరఫరా అవుతుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కి సమాచారం అందింది. దాదాపు వెయ్యి కేజీల మేర గంజాయిని ఉత్తరాధి రాష్ట్రాలకు ట్రక్కులో తీసుకెళ్తున్నారని తెలుసుకున్న డీఆర్ఐ ముమ్మర తనిఖీలు చేపట్టింది.  మొదటగా ఏపీ నుంచి ప్రయాగ్ రాజ్‌కు ట్రక్కులో ముగ్గురు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేశారు.

ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే మీద డీఆర్ఐ అధికారులు నిఘా ఉంచి.. అనుమానం ఉన్న వాహనాలపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ నుంచి లక్నోకు వచ్చిన గంజాయి ట్రక్కు అక్కడి నుంచి ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే చేరుకోగానే డీఆర్ఐ అధికారులు వారిని అడ్డుకున్నారు. వాహనాన్ని నిలిపి తనికీ చేయగా 972 కేజీల గంజాయి స్మగ్లింగ్ విషయం గుర్తించినట్లు తెలిపారు. ఏ అనుమానం రాకుండా నిందితులు ట్రక్కులో ఏర్పాట్లు చేసుకుని గంజాయి స్మగ్లింగ్ చేశారని.. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Also Read: యూట్యూబ్ లో ఆత్మహత్య వీడియో చూసి బాలిక బలవన్మరణం... తల్లికి ముందే ఆ వీడియో చూపించిన చిన్నారి... బంధువులు మరో ఆరోపణ

కోల్‌కతాకు చెందిన వ్యక్తి వీరితో గంజాయి స్మగ్లింగ్ డీల్ కుదుర్చుకున్నట్లు వారి ప్రాథమిక విచారణలో తేలింది. బెంగాల్ వాసిని బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడి ద్వారా ఏపీ నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్ అవుతున్నట్లు డీఆర్ఐ తెలుసుకుంది. తనిఖీలు చేపట్టి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు. ఎన్సీఆర్‌కు గంజాయిని తరలించినట్లు సమాచారం.

Also Read: పోలీసుల అత్సుత్సాహం... డెలివరికి వెళ్తున్న గర్భిణీ కారును 40 నిమిషాలు నిలిపేసిన ఖాకీలు..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget