అన్వేషించండి

Zerodha: అంతా నా 'కర్మ', అప్పుడు చేసిన పనులు ఇప్పుడు వెంటాడుతున్నాయి - జీరోధ సీఈవో సంచలన కామెంట్స్‌

Nithin Kamath Comments: 'అంతిమంగా, మీ చర్యల ఫలాలు మీకు తిరిగి వస్తాయి. ఇప్పుడు నేను నా ఫోన్‌ని సైలెంట్‌లో ఉంచడానికి ఇదే కారణం' అని కామత్‌ వ్యాఖ్యానించారు.

Nithin Kamath Comments: ఎవరికైనా ఇబ్బంది/ కష్టం ఎదురైతే.. అంతా అతని కర్మ అంటారు. కర్మ ఫలితం/ కర్మ ఫలం అనుభవించాల్సిందే అంటూ తత్వం బోధిస్తారు. ప్రముఖ బ్రోకింగ్‌ కంపెనీ జీరోధ ఫౌండర్‌, సీఈవో నితిన్‌ కామత్‌ (Zerodha CEO Nithin Kamath) కూడా సరిగ్గా ఇదే మాటలు చెప్పారు. గతంలో తాను చేసిన కర్మలు ఇప్పుడు తనను వెంటాడుతున్నాయని చెబుతూ, తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. నితిన్‌ కామత్‌ కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్స్‌గా మారాయి.

ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కామత్‌
తన పాత ఉద్యోగం రోజులను గుర్తు చేసుకున్న కామత్‌, ఈ వ్యాఖ్యాలు రాశారు. నితిన్ కామత్, తన 17 సంవత్సరాల వయస్సులో అమెరికాలోని ఓ కాల్ సెంటర్‌లో పని చేశారు. అదే సమయంలో స్టాక్ ట్రేడింగ్ కూడా ప్రారంభించారు. కాల్ సెంటర్ ఉద్యోగం ద్వారా స్టాక్ ట్రేడింగ్ కోసం డబ్బు సమకూర్చుకునేవారు. అంతేకాదు, రోజుకు రూ. 200 జీతానికి ఓ స్టాల్‌లో నిలబడే పని కూడా చేశారట.  

అమెరికాలోని టెలీమార్కెటింగ్ కంపెనీలో కామత్‌ 4 సంవత్సరాల పాటు పని చేశారట. ఉద్యోగంలో భాగంగా, కాల్‌ సెంటర్‌లో కూర్చుని అమెరికాలోని చాలామందికి అనవసర కాల్స్‌ చేశానని కామత్‌ వెల్లడించారు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు తనను వెంటాడుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, తన ఫోన్‌ నిరంతరం సైలెంట్‌లోనే ఉంటోందని, నిరుపయోగంగా మారిందని రాశారు. 'అంతిమంగా, మీ చర్యల ఫలాలు మీకు తిరిగి వస్తాయి. ఇప్పుడు నేను నా ఫోన్‌ని సైలెంట్‌లో ఉంచడానికి ఇదే కారణం' అని కామత్‌ వ్యాఖ్యానించారు. అయితే, కామత్‌ సరదాగానే ఈ కామెంట్స్‌ చేశారు.

కాల్‌ సెంటర్‌లో పని చేసినప్పటి కొన్ని ఫొటోలను కూడా నితిన్ కామత్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్‌ చేశారు. 

అమెరికాలో కాల్ సెంటర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత, నితిన్ కామత్ & నిఖిల్ కామత్ కలిసి, కామత్ అసోసియేట్స్‌ పేరిట ఓ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత, ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జీరోధను 2010లో ప్రారంభించారు. 

టెలిమార్కెటింగ్ కాల్స్‌ నిరోధానికి కమిటీ ఏర్పాటు
ఓ సర్వే ప్రకారం, ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురికి రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ టెలీమార్కెటింగ్ కాల్స్‌ వస్తున్నాయి. ఈ కాల్స్‌లో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు (బ్యాంక్‌ లోన్స్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ వంటివి), స్థిరాస్తి రంగానికి సంబంధించినవి. ఇలాంటి అనవసర కాల్స్‌ను నిరోధించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

మరో ఆసక్తికర కథనం: ఇలాంటి జాబ్‌ అప్లికేషన్‌ ఎక్కడా చూసుండరు, ఉద్యోగం ఇస్తే డబ్బులు ఎదురిస్తాడట

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget