అన్వేషించండి

Vishwakarma Scheme: గుడ్‌న్యూస్‌! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం

Vishwakarma Scheme: సెంట్రల్‌ కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్‌, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది.

Vishwakarma Scheme: 

సెంట్రల్‌ కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్‌, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది. రూ.32,500 కోట్లతో దేశవ్యాప్తంగా ఏడు రైల్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రూ.57,613 కోట్లతో పీఎం ఈ-బస్‌, రూ.13,000 కోట్లతో పీఎం విశ్వకర్మ పథకాలు అమలు చేయనున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వేర్వేరుగా వివరించారు.

ఏడు రైల్వే ప్రాజెక్టులు

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ కమిటీ సమావేశమైంది. రూ32,500 కోట్లతో ఏడు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిని ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్స్‌ట్రక్షన్‌ (EPC) పద్ధతిలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 2,339 కిలోమీటర్ల రైల్వే లైన్లు నిర్మిస్తున్నామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లోని 35 జిల్లాలో నెట్‌వర్క్‌ విస్తరిస్తుంది.

ఏటా 200 మిలియన్‌ టన్నుల మేర సరకు రవాణాను అదనంగా జత చేస్తామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. 'ప్రతి ప్రాజెక్టుకు మరో ప్రాజెక్టుతో సంబంధం ఉంటుంది. దేనినీ విడివిడిగా చూడొద్దు. ఈ ప్రాజెక్టుల వల్ల ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 7.6 కోట్ల పని దినాల పాఉ ఉపాధి దొరుకుతుంది' అని ఆయన వివరించారు.

విశ్వకర్మ పథకం

చేతి వృత్తులపై ఆధారపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆగస్టు 15న మోదీ ప్రకటన మేరకు.. చేనేత, బంగారం, ఇత్తడి, రజక, విశ్వ బ్రాహ్మణ సహా అనేక కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం రూ.13,000 కోట్లతో పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించింది. దీంతో 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. చేతి వృత్తుల వారికి మొదటి దశలో రూ. లక్ష, రెండో దశలో రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. నామమాత్రంగా 5 శాతం వడ్డీని వసూలు చేస్తారు. సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ జయంతిన ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ఆరంభిస్తారు.

ఈ-బస్ పథకం

కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్‌ పథకాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం రూ.57,613 కోట్లను కేటాయించనుంది. కేంద్రం రూ.20,000 కోట్లు ఇస్తుంది. మిగతాది రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.

'దేశవ్యాప్తంగా 10,000 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తాయి. 100 నగరాల్లో ఇవి తిరుగుతాయి. వీటిని ఛాలెంజింగ్‌ మెథడ్‌ ద్వారా ఎంపిక చేస్తాం. అయితే ఆ పట్టణాల్లో జనాభా 3 లక్షలకు పైగా ఉండాలి. పబ్లిక్‌ ప్రైవేటు పాట్నర్‌షిప్‌ పద్ధతిలో పథకాన్ని అమలు చేస్తాం. పదేళ్ల వరకు ఈ-బస్‌లకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. 45000-55000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది' అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ తెలిపారు.

ఎలక్ట్రిక్‌ బస్‌ మొబిలిటీలో టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌, జేబీఎం ఆటో ఆధిపత్యం వహిస్తున్నాయి. అయితే ఈ పథకంలో భాగంగా ప్రభుత్వాలు లేదా నగరాలు బస్సులు నడిపించినందుకు బస్‌ ఆపరేటర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.

Also Read: మీది 30-40 వయసా! 60 కల్లా రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?

టాప్ హెడ్ లైన్స్

Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aus vs Eng World Cup Final: నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget