అన్వేషించండి

Vishwakarma Scheme: గుడ్‌న్యూస్‌! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం

Vishwakarma Scheme: సెంట్రల్‌ కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్‌, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది.

Vishwakarma Scheme: 

సెంట్రల్‌ కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్‌, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది. రూ.32,500 కోట్లతో దేశవ్యాప్తంగా ఏడు రైల్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రూ.57,613 కోట్లతో పీఎం ఈ-బస్‌, రూ.13,000 కోట్లతో పీఎం విశ్వకర్మ పథకాలు అమలు చేయనున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వేర్వేరుగా వివరించారు.

ఏడు రైల్వే ప్రాజెక్టులు

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ కమిటీ సమావేశమైంది. రూ32,500 కోట్లతో ఏడు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిని ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్స్‌ట్రక్షన్‌ (EPC) పద్ధతిలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 2,339 కిలోమీటర్ల రైల్వే లైన్లు నిర్మిస్తున్నామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లోని 35 జిల్లాలో నెట్‌వర్క్‌ విస్తరిస్తుంది.

ఏటా 200 మిలియన్‌ టన్నుల మేర సరకు రవాణాను అదనంగా జత చేస్తామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. 'ప్రతి ప్రాజెక్టుకు మరో ప్రాజెక్టుతో సంబంధం ఉంటుంది. దేనినీ విడివిడిగా చూడొద్దు. ఈ ప్రాజెక్టుల వల్ల ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 7.6 కోట్ల పని దినాల పాఉ ఉపాధి దొరుకుతుంది' అని ఆయన వివరించారు.

విశ్వకర్మ పథకం

చేతి వృత్తులపై ఆధారపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆగస్టు 15న మోదీ ప్రకటన మేరకు.. చేనేత, బంగారం, ఇత్తడి, రజక, విశ్వ బ్రాహ్మణ సహా అనేక కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం రూ.13,000 కోట్లతో పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించింది. దీంతో 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. చేతి వృత్తుల వారికి మొదటి దశలో రూ. లక్ష, రెండో దశలో రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. నామమాత్రంగా 5 శాతం వడ్డీని వసూలు చేస్తారు. సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ జయంతిన ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ఆరంభిస్తారు.

ఈ-బస్ పథకం

కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్‌ పథకాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం రూ.57,613 కోట్లను కేటాయించనుంది. కేంద్రం రూ.20,000 కోట్లు ఇస్తుంది. మిగతాది రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.

'దేశవ్యాప్తంగా 10,000 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తాయి. 100 నగరాల్లో ఇవి తిరుగుతాయి. వీటిని ఛాలెంజింగ్‌ మెథడ్‌ ద్వారా ఎంపిక చేస్తాం. అయితే ఆ పట్టణాల్లో జనాభా 3 లక్షలకు పైగా ఉండాలి. పబ్లిక్‌ ప్రైవేటు పాట్నర్‌షిప్‌ పద్ధతిలో పథకాన్ని అమలు చేస్తాం. పదేళ్ల వరకు ఈ-బస్‌లకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. 45000-55000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది' అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ తెలిపారు.

ఎలక్ట్రిక్‌ బస్‌ మొబిలిటీలో టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌, జేబీఎం ఆటో ఆధిపత్యం వహిస్తున్నాయి. అయితే ఈ పథకంలో భాగంగా ప్రభుత్వాలు లేదా నగరాలు బస్సులు నడిపించినందుకు బస్‌ ఆపరేటర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.

Also Read: మీది 30-40 వయసా! 60 కల్లా రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ITR Filing : మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
Curd Poha: పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
Embed widget