అన్వేషించండి

Vande Bharat Train: వందే భారత్ రైలు టిక్కెట్లను ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి?

Vande Bharat Train Ticket Booking: డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రైలు కాబట్టి, వందే భారత్‌లో ప్రయాణించాలనుకున్నప్పుడు ఎన్ని రోజుల ముందు టిక్కెట్‌ బుక్‌ చేసుకోవాలో ముందే తెలుసుకోవాలి.

Vande Bharat Train Ticket Reservation: మన దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో వందే భారత్ రైలు ఒకటి. ప్రస్తుతం, వివిధ మార్గాల్లో వివిధ నగరాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 100కు పైగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ రైలు ఒక ప్రీమియం రైలు (Premium Train). ఇందులో ప్రయాణం చేసే వాళ్లకు చాలా సౌకర్యాలు లభిస్తాయి. చాలా మంది ప్రజలు వందే భారత్‌ రైల్లో జర్నీ చేసేందుకు ఇష్టపడటానికి ఇదే కారణం.

కిటకిటలాడుతున్న వందే భారత్‌ రైళ్లు
ఒక లెక్క ప్రకారం, వందే భారత్ రైలులో 92 శాతం వరకు సీట్లు నిండిపోతున్నాయి. అంటే, ఈ రైళ్లు ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంటాయి. కాబట్టి, వందే భారత్ రైలులో ప్రయాణించాల్సి వస్తే మీరు ముందుగానే సీట్‌ బుక్‌/ రిజర్వేషన్‌ చేసుకోవాలి. ముందు జాగ్రత్త పడిన వాళ్లే కన్ఫర్మ్ సీటు పొందగలరు. ఎన్ని రోజుల ముందు బుక్‌ చేసుకుంటే వందేభారత్ రైలులో సీట్‌ కన్ఫర్మ్‌ అవుతుందో తెలుసుకుంటే, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జర్నీని ఎంజాయ్‌ చేస్తారు.

ప్రయాణానికి ముందు అడ్వాన్స్‌ బుకింగ్‌
డిమాండ్‌ కారణంగా, వందే భారత్ రైళ్లు ఎప్పుడు చూసినా ప్రయాణికులతో నిండిపోయి కనిపిస్తాయి. మీరు ఈ ప్రీమియం ట్రైన్‌లో జర్నీ చేయాలి అనుకున్నప్పుడు, ప్రయాణానికి కేవలం కొన్ని రోజుల ముందు టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని చూస్తే ఫలితం ఉండకపోవచ్చు. ఊదాసీనంగా ఉండకుండా, మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసిన వెంటనే మీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం ముఖ్యం. వందే భారత్‌ రైళ్లలో రద్దీని బట్టి చూస్తే, సాధారణ రోజుల్లో, మీ ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందుగానే, అంటే ఒక నెల ముందే రిజర్వేషన్‌ కోసం ప్రయత్నించాలి. పీక్ టైమ్‌లో ప్రయాణించాలంటే, అంటే ఏదైనా పండుగ లేదా నూతన సంవత్సర సమయం వంటి సందర్భాల్లో 30 రోజులకు బదులు 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తేనే మీకు సీట్‌ కన్ఫర్మేషన్‌ అవకాశాలు పెరుగుతాయి.

ముందస్తు టిక్కెట్ బుకింగ్ రూల్స్‌లో మార్పు
రైలు ప్రయాణీకుల భద్రత, ప్రయోజనాల కోసం భారతీయ రైల్వే చాలా నియమాలు (Indian Railway Rules) అమలు చేస్తోంది. వీటిలో, అడ్వాన్స్ టిక్కెట్‌ బుకింగ్ (Advance Ticket Booking) విషయంలోనూ ఓ రూల్ ఉంది. గతంలో, రైలు ప్రయాణం కోసం అడ్వాన్స్ బుకింగ్ చేయడానికి 120 రోజులు సమయం ఉండేది. అంటే, ప్రయాణ తేదీకి దాదాపు 4 నెలల ముందుగానే ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. కానీ నవంబర్ 01, 2024 నుంచి భారతీయ రైల్వే ఈ నిబంధన మార్చింది. 120 రోజుల అడ్వాన్స్‌ బుకింగ్‌ వ్యవధిని 60 రోజులకు తగ్గించింది. ఇప్పుడు, ప్రయాణీకులకు టిక్కెట్‌ అడ్వాన్స్ బుకింగ్ కోసం కేవలం రెండు నెలల సమయం మాత్రమే లభిస్తుంది. వందే భారత్‌ రైళ్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. కాబట్టి, మీరు వందే భారత్‌లో ప్రయాణించాలనుకుంటే, 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. దీనివల్ల టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. 

మరో ఆసక్తికర కథనం: మీ హోమ్‌ లోన్‌లో లక్షలాది రూపాయలు ఆదా + అదనపు లాభం - ఈ చిన్న మార్పుతో.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP DesamUnion Budget 2025 Top 10 Unknown Facts | కేంద్ర బడ్జెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
WhatsApp Governance:  వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
Union Budget 2025 : బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా? 
బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా? 
Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
Embed widget