Aadhaar Update: ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్ కార్డు డీయాక్టివ్! కేంద్రం సంచలన నిర్ణయం
Aadhaar Update: చిన్నారుల ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా యాక్టివేషన్ లేకుండా ఉన్న కార్డులను డీయాక్టివ్ చేయాలని నిర్ణయించింది.

Aadhaar Update: పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ కార్డు ఇస్తున్నారు. అయితే వారికి కేవలం ఫొటో ఆధారంగానే ఆధార్ కార్డు, నెంబర్ కేటాయిస్తున్నారు. ఐదేళ్లు దాటిన తర్వాత వారు కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కార్డును గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని UIDAI నిర్ణయించింది.
తాజాగా UIDAI చెప్పిన వివరాలు పరిశీలిస్తే ఐదేళ్లు దాటిన ప్రతి చిన్నారి బయోమెట్రిక్, ఐరీస్, ఫొటోలు అప్డేట్ చేయాలి లేకుంటే వారి కార్డు డీ యాక్టివేట్ అవుతుంది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల చిన్నారుల ఆధార్ అప్డేట్ ఉచితంగా చేయనున్నారు. ఆ పై వయసు ఉన్న వారికి అప్డేషన్ మాత్రం వంద రూపాయలు వసూలు చేస్తారు.
ఇప్పటికే ఆధార్ కార్డు ద్వారా స్కూల్ అడ్మిషన్లు, ఇతర ప్రవేశ పరీక్షలు రాయడం, స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇతర చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దీన్ని మరింత పక్కడ్బందీగా అమలు చేయడానికి కేంద్రం సిద్దమైంది. అందుకే ప్రతి విద్యార్థి ఆధార్ కచ్చితంగా అప్డేట్ అయ్యి ఉండాలని సూచింది.
ఐళ్లు దాడిన వారి ఆధార్ కార్డు అప్డేట్ కాకుంటే మాత్రం ఆ కార్డు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని UIDAI హెచ్చరిస్తోంది. ఇంకా బయోమెట్రిక్, ఐరీస్ అప్డేట్ చేయని వాళ్లు ఉంటే మాత్రం వెంటనే అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.





















