అన్వేషించండి

T Mobile CEO: H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్

H-1B Visa Charges Hike: అమెరికాలో భారతీయ ప్రతిభకు డిమాండ్ కొనసాగుతోంది. ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంచినప్పటికీ, అమెరికా కంపెనీలు ఇద్దరు భారతీయులను సీఈవోలుగా నియమించాయి.

H-1B  Visa Fees Hike In America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాకు సంబంధించి తీసుకున్న నిర్ణయం భారత్‌లో ఐటీ రంగంపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు H-1B వీసాపై ఏదైనా కంపెనీ విదేశీ ఉద్యోగిని అమెరికాకు తీసుకువస్తే, వారి పేరిట 100,000 అమెరికన్ డాలర్ల ఫీజు చెల్లించాలి. అయితే, ఇంతకు ముందు ఈ వీసా కోసం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దానిని ఏకంగా రూ.88 లక్షలకు పెంచేసింది. అదే సమయంలో అమెరికాలోని 2 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలో ఇద్దరు భారతీయులకు సీఈవోగా పదోన్నతి కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. వీరిలో ఒకరు శ్రీనివాస్ 'శ్రీని' గోపాలన్. మరొకరు రాహుల్ గోయల్‌. ట్రంప్ నిర్ణయాలకు అమెరికా కంపెనీలు భయపడేది లేదని ఈ తాజా మార్పులు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరీ శ్రీనివాస్ గోపాలన్..  

IIM- అహ్మదాబాద్‌లో చదుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం టెలికాం రంగంలో దిగ్గజ అమెరికన్ కంపెనీ T-Mobile COO (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన పదోన్నతిలో భాగంగా 55 ఏళ్ల శ్రీనివాసన్ ను సీఈవోగా నియమించారు. నవంబర్ 1న శ్రీనివాస్ గోపాలన్ T-Mobile కొత్త CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపడతారు. 2020 నుండి కంపెనీని నిర్వహిస్తున్న మైక్ సీవర్ట్ స్థానంలోకి శ్రీనివాసన్ వస్తారు.

మైక్ ఇప్పుడు కంపెనీ కొత్త వైస్ ఛైర్మన్ స్థానంలో కొనసాగుతారు. శ్రీనివాసన్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయంపై కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. అతను ఇలా రాసుకొచ్చారు. "T-Mobile తదుపరి CEO కావడం చాలా గౌరవంగా ఉంది. నేను చాలా కాలం నుంచి కంపెనీ సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నాను.  వినియోగదారులకు సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాను" అని పోస్ట్ చేశారు.

గోపాలన్ పేరు మీద అనేక విజయాలు 

గోపాలన్ హిందుస్థాన్ యూనిలీవర్లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్, క్యాపిటల్ వన్, డాయిష్ టెలికాం వంటి అనేక పెద్ద కంపెనీలలో కీలక పదవుల్లో పనిచేశారు. ఈ క్రమంలో అనేక పెద్ద విజయాలను సాధించాడు. ఈ కంపెనీల్లో పనిచేస్తూ, అతను లక్షలాది ఇళ్లకు ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించిన ఘనత దక్కించుకున్నారు. జర్మనీలో రికార్డు మొబైల్ షేర్‌ను సాధించారు. T మొబైల్‌లో గోపాలన్ టెక్నాలజీ, కన్స్యూమర్ తో పాటు బిజినెస్ విభాగాలను గోపాలన్ విజయవంతంగా నిర్వహించారు. అలాగే 5G, AI, ఇతర డిజిటల్ మార్పులను కూడా చూసుకున్నారు.

మోల్సన్ కూర్స్ సీఈవోగా రాహుల్ గోయల్‌

హెచ్1బీ వీసాల చార్జీల పెంపు, విదేశీ ఉద్యోగులకు చెక్ పెడుతున్న సమయంలో చికాగోకు చెందిన బెవరేజ్ కంపెనీ మోల్సన్ కూర్స్ 49 ఏళ్ల రాహుల్ గోయల్‌ను సీఈవోగా నియమించింది. అక్టోబర్ 1 నుండి తమ కొత్త ప్రెసిడెంట్,  CEOగా రాయల్ గోయల్‌ను సంస్థ ఎంపిక చేసింది. అతను గెవిన్ హేటర్స్‌లీ స్థానంలోకి వస్తారు. వాస్తవానికి భారతదేశానికి చెందిన రాహుల్ గోయల్ మైసూర్‌లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బిజినెస్ ఎడ్యుకేషన్ చదవడానికి డెన్వర్‌కు వెళ్లారు. అతను అమెరికా, బ్రిటన్, భారతదేశంలో కూర్స్, మోల్సన్ బ్రాండ్‌లతో పనిచేశాడు.

తన కొత్త బాధ్యత గురించి రాహుల్ స్పందించారు. తాను కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గోపాలన్ లేదా రాహుల్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన చాలా మంది అమెరికాలోని పలు కంపెనీల్లో సీఈవో, పెద్ద పదవుల్లో కొనసాగుతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌ కంపెనీలో సుందర్ పిచాయ్. ఇప్పుడు ఫార్చ్యూన్ గ్లోబల్ 500కి చెందిన ఇతర కంపెనీలు కూడా భారతీయులపై ఆసక్తి చూపుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Embed widget