అన్వేషించండి

T Mobile CEO: H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్

H-1B Visa Charges Hike: అమెరికాలో భారతీయ ప్రతిభకు డిమాండ్ కొనసాగుతోంది. ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంచినప్పటికీ, అమెరికా కంపెనీలు ఇద్దరు భారతీయులను సీఈవోలుగా నియమించాయి.

H-1B  Visa Fees Hike In America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాకు సంబంధించి తీసుకున్న నిర్ణయం భారత్‌లో ఐటీ రంగంపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు H-1B వీసాపై ఏదైనా కంపెనీ విదేశీ ఉద్యోగిని అమెరికాకు తీసుకువస్తే, వారి పేరిట 100,000 అమెరికన్ డాలర్ల ఫీజు చెల్లించాలి. అయితే, ఇంతకు ముందు ఈ వీసా కోసం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దానిని ఏకంగా రూ.88 లక్షలకు పెంచేసింది. అదే సమయంలో అమెరికాలోని 2 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలో ఇద్దరు భారతీయులకు సీఈవోగా పదోన్నతి కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. వీరిలో ఒకరు శ్రీనివాస్ 'శ్రీని' గోపాలన్. మరొకరు రాహుల్ గోయల్‌. ట్రంప్ నిర్ణయాలకు అమెరికా కంపెనీలు భయపడేది లేదని ఈ తాజా మార్పులు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరీ శ్రీనివాస్ గోపాలన్..  

IIM- అహ్మదాబాద్‌లో చదుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం టెలికాం రంగంలో దిగ్గజ అమెరికన్ కంపెనీ T-Mobile COO (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన పదోన్నతిలో భాగంగా 55 ఏళ్ల శ్రీనివాసన్ ను సీఈవోగా నియమించారు. నవంబర్ 1న శ్రీనివాస్ గోపాలన్ T-Mobile కొత్త CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపడతారు. 2020 నుండి కంపెనీని నిర్వహిస్తున్న మైక్ సీవర్ట్ స్థానంలోకి శ్రీనివాసన్ వస్తారు.

మైక్ ఇప్పుడు కంపెనీ కొత్త వైస్ ఛైర్మన్ స్థానంలో కొనసాగుతారు. శ్రీనివాసన్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయంపై కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. అతను ఇలా రాసుకొచ్చారు. "T-Mobile తదుపరి CEO కావడం చాలా గౌరవంగా ఉంది. నేను చాలా కాలం నుంచి కంపెనీ సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నాను.  వినియోగదారులకు సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాను" అని పోస్ట్ చేశారు.

గోపాలన్ పేరు మీద అనేక విజయాలు 

గోపాలన్ హిందుస్థాన్ యూనిలీవర్లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్, క్యాపిటల్ వన్, డాయిష్ టెలికాం వంటి అనేక పెద్ద కంపెనీలలో కీలక పదవుల్లో పనిచేశారు. ఈ క్రమంలో అనేక పెద్ద విజయాలను సాధించాడు. ఈ కంపెనీల్లో పనిచేస్తూ, అతను లక్షలాది ఇళ్లకు ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించిన ఘనత దక్కించుకున్నారు. జర్మనీలో రికార్డు మొబైల్ షేర్‌ను సాధించారు. T మొబైల్‌లో గోపాలన్ టెక్నాలజీ, కన్స్యూమర్ తో పాటు బిజినెస్ విభాగాలను గోపాలన్ విజయవంతంగా నిర్వహించారు. అలాగే 5G, AI, ఇతర డిజిటల్ మార్పులను కూడా చూసుకున్నారు.

మోల్సన్ కూర్స్ సీఈవోగా రాహుల్ గోయల్‌

హెచ్1బీ వీసాల చార్జీల పెంపు, విదేశీ ఉద్యోగులకు చెక్ పెడుతున్న సమయంలో చికాగోకు చెందిన బెవరేజ్ కంపెనీ మోల్సన్ కూర్స్ 49 ఏళ్ల రాహుల్ గోయల్‌ను సీఈవోగా నియమించింది. అక్టోబర్ 1 నుండి తమ కొత్త ప్రెసిడెంట్,  CEOగా రాయల్ గోయల్‌ను సంస్థ ఎంపిక చేసింది. అతను గెవిన్ హేటర్స్‌లీ స్థానంలోకి వస్తారు. వాస్తవానికి భారతదేశానికి చెందిన రాహుల్ గోయల్ మైసూర్‌లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బిజినెస్ ఎడ్యుకేషన్ చదవడానికి డెన్వర్‌కు వెళ్లారు. అతను అమెరికా, బ్రిటన్, భారతదేశంలో కూర్స్, మోల్సన్ బ్రాండ్‌లతో పనిచేశాడు.

తన కొత్త బాధ్యత గురించి రాహుల్ స్పందించారు. తాను కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గోపాలన్ లేదా రాహుల్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన చాలా మంది అమెరికాలోని పలు కంపెనీల్లో సీఈవో, పెద్ద పదవుల్లో కొనసాగుతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌ కంపెనీలో సుందర్ పిచాయ్. ఇప్పుడు ఫార్చ్యూన్ గ్లోబల్ 500కి చెందిన ఇతర కంపెనీలు కూడా భారతీయులపై ఆసక్తి చూపుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget