News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tata Group: టాప్‌ రేంజ్‌లో పెరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు, ఎంత హైక్‌ ఇచ్చారో తెలుసా?

టాటా గ్రూప్‌లోని టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల నెలవారీ ఆదాయాల్లో సిక్స్‌టీన్‌ నుంచి సిక్స్‌టీ పర్సెంట్‌ వరకు అద్భుతమైన పెరుగుదల కనిపించింది.

FOLLOW US: 
Share:

Tata Group Top Executives' Salaries Hike: ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో గడగడ వణుకుతున్నాయి. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడానికి, చిన్నాచితక వ్యయాల నుంచి ఉద్యోగాలు ఊడబీకే వరకు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే, మన దేశంలోని అత్యంత విలువైన బిజినెస్‌ గ్రూప్‌ టాటా గ్రూప్, తన టాప్ ఎగ్జిక్యూటివ్‌కు అద్భుతమైన బహుమతి ఇచ్చింది. అది కూడా సాదాసీదా పెంపు కాదు, కళ్లు చెదిరే రేంజ్‌లో పే హైక్‌ (pay hike) ప్రజెంట్‌ చేసింది. 

రూ. 22 లక్షల కోట్ల విలువైన టాటా గ్రూప్‌లోని టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల నెలవారీ ఆదాయాల్లో సిక్స్‌టీన్‌ నుంచి సిక్స్‌టీ పర్సెంట్‌ వరకు అద్భుతమైన పెరుగుదల కనిపించింది.

ఏ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు పెరిగాయి?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇండియన్‌ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌ (IHCL), టాటా పవర్ (Tata Power), ట్రెంట్ (Trent), టాటా కన్స్యూమర్ (Tata Consumer) వంటి గ్లోబల్‌ ఫేమస్‌ కంపెనీలున్న టాటా గ్రూప్‌లో, వ్యాపారంలో అధిక వృద్ధి చూపించిన ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు పెరిగాయి. దేశంలోని ఇతర బిజినెస్‌ గ్రూప్‌ల కంటే ఎక్కువ హైక్‌ను టాటా గ్రూప్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అందుకున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిజినెస్‌ గ్రూప్‌గా మారే క్రమంలో, టాటా సన్స్‌ 97 బిలియన్‌ డాలర్ల అమ్మకాల ఆదాయ వృద్ధిని సాధించింది. దీంతో పాటు, దాని కంపెనీల్లో 20 శాతం బలమైన వృద్ధి కనిపించింది.

జీతంలో పెంపు, కమీషన్, ఇతర చాలా రకాల ప్రయోజనాలు కూడా శాలరీ ప్యాకేజీ హైక్‌లో భాగంగా పెరిగాయి. భారీగా జీతాల పెంపును నజరానాగా అందుకున్న టాటా గ్రూప్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాజీ CEO రాజేష్ గోపీనాథన్ పేరు కూడా ఉంది.

ఏ టాప్ ఎగ్జిక్యూటివ్‌ జీతం ఎంత పెరిగింది?

ట్రెంట్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు జీతం 62 శాతం పెరిగింది.

ఇండియన్ హోటల్స్‌కు చెందిన పునీల్ చత్వాల్ జీతపు ఆదాయం 37 శాతం పెరిగింది.

టాటా కన్జ్యూమర్‌కు చెందిన సునీల్ డిసౌజా జీతం 24 శాతం పెరిగింది.

టాటా కెమికల్స్‌కు చెందిన ఆర్,ముకుందన్ జీతం 16 శాతం పెరిగింది.

టాటా పవర్‌కు చెందిన ప్రవీర్ సిన్హా జీతం 16 శాతం పెరిగింది.

టీసీఎస్‌కు చెందిన రాజేష్ గోపీనాథన్ జీతం 13 శాతం పెరిగింది.

దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ TCS

టాటా గ్రూప్‌లోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ కన్సల్టెన్సీ కంపెనీ ఇంటర్‌బ్రాండ్ (Interbrand) ఈ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. భారతదేశంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లతో టాప్-50 లిస్ట్‌ను ప్రకటించింది. 

ఈ సంవత్సరం ఎడిషన్‌లోని మొత్తం కంపెనీల విలువ రూ. 8,31,005 కోట్లు ($100 బిలియన్లు). గత దశాబ్ద కాలంలో ఈ విలువ ఏకంగా 167% పెరిగింది. లిస్ట్‌ మొత్తం విలువ $100 బిలియన్‌ మార్కును దాటడం ఇదే తొలిసారి.

మోస్ట్‌ వాల్యూడ్‌ టాప్‌-10 ఇండియన్‌ బ్రాండ్స్‌:

ఇంటర్‌బ్రాండ్ రిపోర్ట్‌ ప్రకారం, ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న TCS బ్రాండ్‌ వాల్యూ రూ. 1,09,576 కోట్లు. సెకండ్‌ ర్యాంక్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రాండ్‌ విలువ రూ. 65,320 కోట్లు. మూడో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ వాల్యూ రూ. 53,324 కోట్లు. 

4. HDFC బ్యాంక్‌ - రూ. 50,291 కోట్లు.
5. జియో - రూ. 49.027 కోట్లు.
6. ఎయిర్‌టెల్‌ - రూ. 46,553 కోట్లు
7. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) - రూ. 33,792 కోట్లు
8. మహీంద్ర & మహీంద్ర - రూ. 31,136 కోట్లు
9. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) - రూ. 30.055 కోట్లు
10. ICICI బ్యాంక్‌ - రూ. 25,915 కోట్లు

మరో ఆసక్తికర కథనం: పరుగులు పెడుతున్న పారిశ్రామిక రంగం, భారీగా పెరిగిన ఉత్పత్తి 

Published at : 13 Jun 2023 09:59 AM (IST) Tags: TCS Tata Sons Tata Power Indian Hotels Trent

ఇవి కూడా చూడండి

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది