అన్వేషించండి

Share Market Opening Today: ప్రారంభ లాభాలపై పట్టు కోల్పోయిన మార్కెట్లు - చేతులెత్తేసిన సెన్సెక్స్, నిఫ్టీ

బ్రాడర్‌ మార్కెట్‌లో మిడ్‌ & స్మాల్‌ క్యాప్స్‌ జోరు కంటిన్యూ అవుతోంది. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరగ్గా, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.6 శాతం లాభపడింది.

Stock Market News Today in Telugu: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 19 డిసెంబర్‌ 2023) పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే 1 శాతం పైగా పెరిగాయి, మార్కెట్‌ను కిక్‌ స్టార్ట్‌ చేశాయి. అయితే, ఓపెనింగ్‌ గెయిన్స్‌ నిమిషాల్లోనే ఆవిరయ్యాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ లేకపోవడంతో, ఓపెనింగ్‌ సెషన్‌లో మన మార్కెట్‌లో అనిశ్చితి కనిపించింది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (సోమవారం) 71,315 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 164.19 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 71,479 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. అయితే, వెంటనే ఎరుపు రంగులోకి జారిపోయింది. గత సెషన్‌లో 21,419 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 59 పాయింట్లు లేదా 0.28 శాతం పెరుగుదలతో 21,477 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. అక్కడి నుంచి కిందకు జారుతూ వచ్చి 21,400 స్థాయి దగ్గర కాసేపు పోరాడినా, ఆ స్థాయిలోనూ నిలదొక్కుకోలేదు.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో... స్టాక్‌ స్ల్పిట్‌కు 2024 జనవరి 05ను రికార్డ్‌ డేట్‌ ప్రకటించిన నెస్లే ఇండియా 1.5 శాతం లాభపడింది. ఇండెక్స్ హెవీవెయిట్స్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. మరోవైపు, TCS, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, మహీంద్ర & మహీంద్ర, ఏషియన్ పెయింట్స్ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో కనిపించాయి.

వేదాంత, సైమెన్స్ ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉన్నాయి. వేదాంత, ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్‌కు ప్రకటించింది. దీంతో, మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో ఈ స్టాక్‌ 2 శాతానికి పైగా లాభపడింది. సైమెన్స్‌, తన ఇంధన వ్యాపారాన్ని విడదీసి, ప్రత్యేక కంపెనీగా మార్చడానికి చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సిమెన్స్ షేర్లు దాదాపు ఒక శాతం పెరిగాయి.

బ్రాడర్‌ మార్కెట్‌లో మిడ్‌ & స్మాల్‌ క్యాప్స్‌ జోరు కంటిన్యూ అవుతోంది. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరగ్గా, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.6 శాతం లాభపడింది.

ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 147.46 పాయింట్లు లేదా 0.21% తగ్గి 71,167.63 దగ్గర; NSE నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.20% నష్టంతో 21,375.25 వద్ద ట్రేడవుతున్నాయి.

బలంగా ఉన్న భారతదేశ ఆర్థిక డేటా, ఆరోగ్యకరమైన కార్పొరేట్ ఆదాయాలు, పెరిగిన FII ఇన్‌ఫ్లోస్‌ కారణంగా ఓవరాల్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. అయితే, ఇటీవలి బలమైన ర్యాలీని దృష్టిలో పెట్టుకుని, షార్ట్‌టైమ్‌లో కొంత అస్థిరత కనిపించొచ్చని చెబుతోంది. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
2024లో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశావాదాన్ని యూఎస్‌ మార్కెట్లు సోమవారం సెషన్‌లోనూ కొనసాగించాయి, లాభాలు అందుకుని క్లోజ్‌ అయ్యాయి. S&P 500, నాస్‌డాక్ 0.5 శాతం చొప్పున లాభపడగా, డౌ జోన్స్ పెద్దగా మారలేదు. 2023లో, బ్యాంక్ ఆఫ్ జపాన్ తుది వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో, ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో ఆసియా మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ఉన్నాయి. నికాయ్‌, హాంగ్ సెంగ్, కోస్పి 0.06-1 శాతం వరకు క్షీణించాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget