అన్వేషించండి

Sebi - Adani: ఆర్థిక శాఖ వద్దకు అదానీ పంచాయతీ, రిపోర్ట్‌ చేయనున్న సెబీ

ఈ నెల 15న (బుధవారం), ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సెబీ అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం.

Sebi - Adani: అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెనక్కు తీసుకున్న ఎఫ్‌పీవో (Adani Enterprises FPO) మీద భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్‌డేట్ చేయనుందని నమ్మకమైన సమాచారం వచ్చింది. 

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల (Adani Group Stocks) విలువలు పతనమయ్యాయి. కొన్నేళ్లుగా జరిగిన షేర్ల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగాయని, అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న విదేశీ కంపెనీలతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లను కొనిపించి కృత్రిమ డిమాండ్‌ సృష్టించారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. 2023 జనవరి 24 హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్ బయటకు వచ్చింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో మీదే ఫోకస్‌?
రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత, జనవరి 27-31 తేదీల మధ్య, రూ. 20,000 కోట్ల విలువైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో జరిగింది. మూడు రోజుల ఎఫ్‌పీవోలో... మొదటి రెండు రోజులు చాలా చప్పగా గడిచినా, చివరిదైన మూడో రోజు మాత్రం అన్ని షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ ఫ్లాప్‌ అయినా, సంస్థాగత పెట్టుబడిదార్ల వాటా పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. యాంకర్‌ రౌండ్‌లోనూ గ్లోబర్‌ ఇన్వెస్టర్లు పాల్గొని పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌పీఓను గట్టెక్కించేందుకు కొన్ని సంస్థలు అదానీ గ్రూప్‌తో లాలూచీ పడ్డాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే, షేర్ల పతనం కారణంగా ఎఫ్‌పీవో ధర కంటే తక్కువ ధరకే అప్పుడు ఓపెన్‌ మార్కెట్‌లో షేర్లు అందుబాటులో ఉన్నాయి. అయినా, కొన్ని పెట్టుబడి కంపెనీలు ఎక్కువ రేటు పెట్టి ఎఫ్‌పీవోలో షేర్లు కొనడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో, రూ. 20 వేల కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రద్దు చేసింది.

ఎఫ్‌పీవోలో పాల్గొనే యాంకర్‌ ఇన్వెస్టర్లకు కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓలో నిబంధనలను పట్టించుకోలేదా అనే కోణంలో సెబీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు, ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌లో (ఎఫ్‌పీఓ) షేర్లు కొన్న రెండు బడా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలతో అదానీ గ్రూప్‌నకు ఉన్న సంబంధాలపైనా ఆరా తీసినట్లు సమాచారం.

ఆర్థిక మంత్రితో బుధవారం సమావేశం!
ఈ నెల 15న (బుధవారం), ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సెబీ అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ స్టాక్స్‌ ఇటీవల పతనమైన సమయంలో రెగ్యులేటర్ తీసుకున్న నిఘా చర్యలపై ఆర్థిక మంత్రికి సెబీ బోర్డు వివరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి, తమ పేరు బయట పెట్టవద్దని వెల్లడించాయి. అదానీ గ్రూప్ సంస్థల్లోకి ఆఫ్‌షోర్ ఫండ్ ప్రవాహాలపై (విదేశీ పెట్టుబడులు) గురించి కూడా అప్‌డేట్‌ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. 

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ మార్కెట్‌ రూట్‌, ట్రేడ్‌ ప్యాట్రన్స్‌, ఎఫ్‌పీవోలో షేర్‌ సేల్‌, విదేశీ పెట్టుబడులు వంటి అన్ని విషయాల మీదా ఆర్థిక శాఖకు సెబీ బోర్డ్‌ నివేదించనున్నట్లు తెలుస్తోంది. 

దీని మీద కామెంట్‌ కోసం సెబీకి రాయిటర్స్ ఒక ఈ-మెయిల్‌కు పంపినా సెబీ అధికారులు స్పందించలేదు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget