By: ABP Desam | Updated at : 03 Mar 2023 11:16 AM (IST)
Edited By: Arunmali
పెన్నీ స్టాక్ మోసాన్ని రట్టు చేసిన సెబీ
Sebi on YouTube Channels: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి (Arshad Warsi), అతని భార్య మరియా గోరెట్టిపై (Maria Goretti) సెబీ నిషేధం విధించింది. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఉపయోగించి షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినందుకు, సాధ్నా బ్రాడ్కాస్ట్ కంపెనీ ప్రమోటర్లు సహా 31 సంస్థలను కూడా నిషేధించింది. కొన్ని కంపెనీల షేర్ల ధరల్లో రిగ్గింగ్ జరిగినట్లు ("పంప్ & డంప్") ఏప్రిల్ - సెప్టెంబర్ 2022 కాలంలో SEBIకి ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన సెబీ, ఈ నిర్ణయం తీసుకుంది.
"పంప్ & డంప్" స్కీమ్ అంటే..?
స్టాక్ మార్కెట్లో "పంప్ & డంప్" స్కీమ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక కంపెనీ చేసే వ్యాపారం, ఆర్థిక పరిస్థితితో (ఫండమెంటల్స్) సంబంధం లేకుండా, స్టాక్ ధరను కృత్రిమంగా పెంచేలా చేసే మోసాన్నే "పంప్ & డంప్" స్కీమ్ అంటారు. అంటే, ఒక పెన్నీ స్టాక్లో కొందరు వ్యక్తులు ముందుగా పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత దాని గురించి విపరీతమైన ప్రచారం చేస్తారు. ఉదాహరణకు, ఒక స్టాక్ను ఏ రూపాయికో, రెండు రూపాయలకో, 5 రూపాలయలకో ముందుగానే కొంటారు. ఆ తర్వాత దానిని ప్రమోట్ చేయడం ప్రారంభిస్తారు. దాని గురించి యూట్యూబ్ సహా ఇతర వెబ్సైట్స్లో విపరీతంగా యాడ్స్ ఇస్తారు. ఆ స్టాక్ ఏ రూ. 400 లేదా రూ. 500 వెళ్లిపోతుందని, ఇప్పుడు తక్కువ ధరలో ఉంది కొనుక్కోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తారు. స్టాక్ మార్కెట్ యూట్యూబర్లు, రిపోర్టర్లకు కూడా డబ్బులు పంచి, ఆ స్టాక్ గురించి పాజిటివ్గా చెప్పిస్తారు. ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి తామే అందులో పెట్టుబడులు పెంచుతూ వెళతారు. దీంతో, కొన్ని రోజుల పాటు సదరు స్టాక్ ధర పెరుగుతూ వెళ్తుంది. ఈ ర్యాలీని చూసి, అమాయక లేదా అత్యాశపడే ఇన్వెస్టర్లు ఆ స్టాక్ను కొనడం ప్రారంభిస్తారు. దీంతో స్టాక్ ధర మరింత పెరుగుతుంది. అలా, ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ స్టాక్ను మోసపూరిత పెట్టుబడిదార్లు అమ్మడం ప్రారంభిస్తారు, భారీ లాభాలు ఆర్జిస్తారు. అమాయక లేదా అత్యాశపడే ఇన్వెస్టర్లు ఆ వలలో చిక్కుకుని నష్టపోతారు.
అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టి, సాధ్నా బ్రాడ్కాస్ట్ కంపెనీ ప్రమోటర్లు, ఇతర వ్యక్తులు చేసింది ఈ "పంప్ & డంప్" మోసమే. సాధ్నా బ్రాడ్కాస్ట్ లిమిటెడ్, షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయండంటూ ఈ వ్యక్తులు యూట్యూబ్ వీడియోల ద్వారా మదుపర్లకు సిఫారసు చేసి వాటి ధరల్ని కృత్రిమంగా పెంచారని సెబీ తేల్చింది.
2022 జులై నెలలో, సాధ్నా బ్రాడ్కాస్ట్ షేర్ ధర గురించి తప్పుదారి పట్టించే వీడియోలు "ది అడ్వైజర్" "మనీవైస్" అనే రెండు YouTube ఛానెల్ళ్లలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు విడుదలైన తర్వాత, షేర్ ధర & వాల్యూమ్లో విపరీతమైన జంప్ కనిపించింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో చూసిన రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టారు. సాధ్నా బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లకు కూడా ఈ మోసంలో భాగం ఉందని నిర్ధరించింది.
"పంప్ & డంప్" స్కీమ్ ద్వారా అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, అతని భార్య మరియా రూ. 37.56 లక్షల లాభం తీసుకున్నారని, ఇక్బాల్ హుస్సేన్ వార్సి రూ. 9.34 లక్షలు సంపాదించారని సెబీ వెల్లడించింది.
తప్పుదారి పట్టించే వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా అక్రమంగా లాభపడినందుకు ఈ మోసగాళ్లందరికీ సెబీ రూ. 41.85 లక్షల జరిమానా విధించింది. వాళ్లు అక్రమంగా సంపాదించిన రూ. 54 కోట్ల లాభాలను కూడా స్వాధీనం చేసుకుంది.
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!
Cryptocurrency Prices: బిట్కాయిన్ రూ.24 లక్షలు క్రాస్ చేసేనా?
Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్, రష్మిక
Stocks to watch 22 March 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - డివిడెండ్ స్టాక్స్ Hindustan Zinc, SBI Card
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!