అన్వేషించండి

Russia Ukraine Conflict: 100కే భయపడ్డాం - అతి త్వరలోనే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.150 అవుతోందా?

Petrol Price - Diesel Price: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఇండియాలోనూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి. మరికొన్ని రోజుల్లో పెట్రోలు ధరలు రూ.150కి చేరుకుంటాయేమోనని ప్రజలు భయపడుతున్నారు.

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం (Russia Ukraine Conflict) ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది! ఐరోపా, ఆసియా దేశాలకు ముడి చమరులు, సహజ వాయువును ఎక్కువగా రష్యానే ఎగుమతి చేస్తుంటుంది. ఆంక్షలు, సరఫరా లోపం వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. ఇండియాలోనూ ఇది పెట్రోలు, డీజిల్‌ ధరల (Petrol Price - Diesel Price) పెరుగుదలకు ఊతమిస్తోంది. మరికొన్ని రోజుల్లో పెట్రోలు ధరలు రూ.150కి చేరుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బ్యారెల్‌ క్రూడ్‌ ధర 120 డాలర్లకు
 
ముడి చమురు సరఫరాపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దాంతో నెల రోజుల క్రితం 75 డాలర్లుగా ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర ఇప్పుడు 105 డాలర్లకు పెరిగింది. గురువారం సైనిక చర్యకు దిగుతున్నామని పుతిన్‌ ప్రకటించగానే ముడి చమురు ధర 103 డాలర్లకు చేరుకుంది. ఏడేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి పెరుగుదల. యుద్ధం మరీ తీవ్రమైన రష్యాపై ఆంక్షలు మరింతగా విధిస్తారని విశ్లేషకులు అంటున్నారు. దాంతో సరఫరా, గిరాకీ మధ్య సమతుల్యం దెబ్బతినడంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బ్యారెల్‌ ధర 120 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

పెరగనున్న Petrol ధరలు

ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు ధరలు రాష్ట్రాలను బట్టి మారుతున్నాయి. దీపావళి సమయంలో కేంద్ర ప్రభుత్వం సర్‌ఛార్జీలు, కొన్ని పన్నులు తగ్గించడంతో లీటరుకు రూ.8-10 వరకు ధర తగ్గింది. దాంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు రూ.90-95లోపే ఉన్నాయి. కాంగ్రెస్‌, స్థానిక పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ధరలు తగ్గించకపోవడంతో లీటరు పెట్రోలు రూ.108 వరకు ఉంటోంది. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం బ్యారెల్‌కు 75 డాలర్లు ఉన్నప్పటి ధరలకే పెట్రోల్‌ విక్రయిస్తున్నాయి. ఇప్పుడది 105 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది సగటున బ్యారెల్‌కు 110 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. మరి 75 డాలర్లప్పుడే రూ.100కు పెట్రోల్‌ విక్రయించగా లేనిది 120 డాలర్లకు చేరితే కచ్చితంగా రూ.150కి పెరిగే అవకాశం లేకపోలేదు.

సుంకాలు తగ్గిస్తేనే

దాదాపుగా ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌, దిగుమతి సుంకం, సర్‌ఛార్జీ, కస్టమ్స్‌ వంటి పన్నులే అధిక శాతం ఉంటున్నాయి. ఇప్పుడు ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ ధరతో అనుసంధానం అయ్యాయి. దానివల్ల ఆయిల్‌ కంపెనీలు ఇప్పుడు నష్టాలకే పెట్రోలును విక్రయిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ధరలు పెంచక తప్పదు. అలాంటప్పుడు రూ.120కి మించి పెట్రోలును విక్రయిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చే అవకాశం ఉంది. అందుకే సర్‌ఛార్జీలు, కస్టమ్స్‌ పన్నులను తగ్గించి ప్రభుత్వాలు ఈ భారం పడకుండా చూస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతోందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget