By: ABP Desam | Updated at : 04 Aug 2021 06:56 AM (IST)
స్థిరంగానే పెట్రోల్ డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో హైదరాబాద్ సహా ముంబయి, చెన్నై, దిల్లీ వంటి అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత 15 రోజులకు పైగా స్థిరంగా ఉంటున్నాయి. డీజిల్ రేట్ల విషయంలో కూడా ఇలాగే స్థిరత్వం కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ఆగస్టు 4న రూ.105.83 గా ఉంది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. హైదరాబాద్లో గత 15 రోజులకు పైగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు తాజాగా ఇలా ఉన్నాయి.
ఏపీలో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ ధర రూ.0.59 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.108.64 గా ఉంది. డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి రూ.100.17కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత 10 రోజుల ఇంధన ధరలను పరిశీలిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.80 ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.52 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో ఏకంగా రూ.048 పైసలు తగ్గి రూ.98.43గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా ఇంధన ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకుపైగా హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కాస్త ఎక్కువగానే ఉంది. లీటరు పెట్రోలు ధర రూ.0.17 పైసలు తగ్గి రూ.108.04 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.99.60కు చేరింది.
తెలంగాణలో ఆగస్టు 4న పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా స్థిరంగా ఉంటోంది. కరీంనగర్లో పెట్రోల్ ధర రూ.105.24, డీజిల్ ధర రూ.97.72 వద్ద ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధర 0.12 పైసలు, డీజిల్ ధర రూ.0.61 పైసలు పెరిగింది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా ఉంది. ముందు రోజు ధరతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే రేట్లు ఉన్నాయి.
నిజామాబాద్లో డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.19 పైసలు తగ్గి రూ.99.29 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.17 పైసలు తగ్గి రూ.107.27 గా ఉంది. నిజామాబాద్లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు తరచుగానే ఉంటున్నాయి.
స్థానిక పన్నుల పెంపు వల్లే ధరల పెరుగుదల..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా ఎగబాకిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గతేడాది ఏప్రిల్లో జీవితకాల కనిష్ఠానికి ముడి చమురు ధరలు చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరిగాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 3 నాటి ధరల ప్రకారం 71.48 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో గరిష్ఠానికి చేరుతుంటే సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి.
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Adani Group Investment Plan: ఇన్ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు
Train Ticket: కన్ఫర్మ్డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్ ఛెస్ట్ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు
GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>