అన్వేషించండి

వచ్చే ఏడాదంతా భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకమే - ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్

International Business Report 2023: వచ్చే ఏడాదంతా భారత్‌ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగానే ఉంటుందని ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ వెల్లడించింది.

 International Business Report 2023: అంతర్జాతీయంగా ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నా భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం సానుకూలంగా ముందుకు దూసుకుపోతోంది. International Business Report (IBR) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. IBRతో పాటు Grant Thornton సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. భారత్‌లో దాదాపు 80% మేర మిడ్ మార్కెట్ బిజినెస్ వచ్చే 12 నెలల పాటు సానుకూలంగానే ఉంటుందని అంచనా వేశాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఇది 78% మేర పెరిగే అవకాశముందని వెల్లడించింది. 2023లో జూన్-డిసెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. భారత్‌లో పరిస్థితి ఇలా ఉంటే అటు Asia Pacific Regionలోని దేశాల్లో మాత్రం 2023లో మొదటి ఆరు నెలలతో పోల్చుకుంటే తరవాతి ఆరు నెలల్లో అంచనాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందన్న విశ్వాసం తగ్గిపోయింది. ఈ సర్వే ఫలితాలపై Grant Thornton Bharat ప్రతినిధి సిద్ధార్థ్ నిగమ్ స్పందించారు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ భారత్‌లో వ్యాపార రంగాన్ని సానుకూల దిశలో తీసుకెళ్తోందని ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అందుకు కారణమని వివరించారు. 

"భారత్‌లో ఆర్థిక పరంగా మేం ఊహించిన దాని కన్నా ఎక్కువ సానుకూలత వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది కాలంలో తమ బిజినెస్‌  పెరుగుతుందని 83% మేర మిడ్ మార్కెట్ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా వ్యాపారావకాశాలు పెరుగుతాయన్న నమ్మకం బలపడుతోంది. పైగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డిజిటల్‌ ట్రాన్‌ఫర్మేషన్‌ లాంటివి అందుకు దోహదపడుతున్నాయి. ఆర్థిక పరంగా వృద్ధి సాధిస్తే...అటు ఉద్యోగావకాశాలూ పెరుగుతాయి. 78% మేర కంపెనీలు కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశముంటుందని నమ్ముతున్నాయి"

- సిద్ధార్థ నిగమ్, గ్రాంట్ థార్న్‌టన్ భారత్ 

అటు కొత్త టెక్నాలజీని వినియోగించుకోడంలోనూ భారత్ ముందుంటుందని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్‌ని పెద్ద ఎత్తున వినియోగించుకునే అవకాశముందని 72% మేర సంస్థలు వెల్లడించాయి. ఈ రంగంలో పెట్టుబడులూ పెరిగే అవకాశాలున్నాయి. అయితే...ఈ సాంకేతికత విప్లవం కారణంగా అప్‌స్కిల్లింగ్ కోసం 44% మేర ఖర్చులు పెరుగుతాయని అంచనా వేశారు. AI టెక్నాలజీ వల్ల వినియోగదారుల అంచనాలకు మించి సర్వీస్‌లు అందించేందుకు వీలుంటుందని 58% మేర సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ సర్వేపై Grant Thornton Bharat టెక్‌లీడర్ రాజా లహ్రీ స్పందించారు. సంస్థలు కొత్తగా వస్తున్న టెక్నాలజీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, వాటికి తగ్గట్టుగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. 

"మార్కెట్‌లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు ఒక్కోసారి సవాలుగా మారుతుండొచ్చు. ఆదాయం తగ్గిపోతుంది. మార్కెట్ షేర్స్‌ పడిపోతాయి. ఈ సవాళ్లను దాటుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. AI,Cloud తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి"

- రాజా లహ్రీ, టెక్‌ లీడర్, గ్రాంట్ థార్న్‌టన్ భారత్ 

ఏంటీ IBR..?

మిడ్ మార్కెట్‌ కంపెనీల స్థితిగతులపై ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ సర్వే చేస్తుంది. సర్వేలు చేయడంలో ప్రపంచంలోనే టాప్ కంపెనీల్లో ఇదీ ఒకటి. ఏడాదికి రెండు సార్లు ఈ సర్వే నిర్వహిస్తుంది. రకరకాల ఇండస్ట్రీలకి చెందిన ఆయా కంపెనీల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్‌లు, ఛైర్‌పర్సన్స్, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget