అన్వేషించండి

RBI - Inflation: ద్రవ్యోల్బణం ఎందుకు అదుపులోకి రావట్లేదు, ఆర్‌బీఐ విఫలమైందా?

ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును ఆరు సార్లు పెంచడం వల్ల ప్రజలపై EMIల భారం పెరిగింది తప్ప, ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోకి రాలేదు.

RBI - Inflation: 2022 నవంబర్ & డిసెంబర్‌ నెలల్లో దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) తగ్గింది, RBI టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే దిగువకు వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.88 శాతంగా, డిసెంబర్‌లో 5.72 శాతంగా నమోదైంది. కానీ, కొత్త సంవత్సరం తొలి నెలలో (2023 జనవరి) రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ రెక్కలు చాచి పైకి ఎగిరింది. RBI టాలరెన్స్ బ్యాండ్‌ను మళ్లీ దాటి, భారీగా పెరిగి 6.52 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విఫలమైందా అనే పెద్ద ప్రశ్న తలెత్తుతోంది.

నిజంగానే ఆర్‌బీఐ విఫలమైందా?
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, RBI తన రెపో రేటును 2.50 శాతం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని ‍‌(2022-23) గత 9 నెలల్లోనే పాలసీ రేట్లను 6 దఫాలుగా పెంచింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయింది. దీని వల్ల, ప్రజలు కట్టే నెలవారీ కిస్తీలు (EMIలు) ఖరీదుగా మారడం రివాజైంది. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుదలను అదుపు చేయలేదని ఆర్‌బీఐని నిందించడం సరికాదని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పంత్ అభిప్రాయపడ్డారు. దేశంలో సరుకుల సరఫరాలో సమస్యల కారణంగానే భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. ఆహార పదార్థాలతో పాటు పాలు & పాల సంబంధిత పదార్థాల ధరలు భారీగా పెరిగిన కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పారు.

ద్రవ్యోల్బణం తగ్గలేదు, కానీ EMI పెరుగుతోంది
2022 ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.80 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత, 2022 మే నెల 4న, ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారి పాలసీ రేటును RBI మార్చింది, రెపో రేటును పెంచింది. వడ్డీ రేటు పెంపు వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్‌బీఐ అప్పుడు చెప్పింది. కానీ ద్రవ్యోల్బణం మాత్రం 7 శాతానికి పైగానే కొనసాగింది. అప్పటి నుంచి ప్రతి మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును ఆర్‌బీఐ పెంచుతూ వెళ్లింది. 2022 మే 4వ తేదీకి ముందు రెపో రేటు 4 శాతంగా ఉండేది. రెపో రేటును దఫదఫాలుగా పెంచుతూ వచ్చిన ఆర్‌బీఐ, తాజాగా, 2023 ఫిబ్రవరి 8న, రెపో రేటును మరో పావు శాతం పెంచింది. దీంతో, ఇప్పుడు రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఈ వడ్డీ రేటు పెంపును ప్రకటించిన నాలుగు రోజులకే 2023 జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. జనవరిలో చిల్లర ద్రవ్యోల్బణం ఆరున్నర శాతం దాటి 6.52 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును ఆరు సార్లు పెంచడం వల్ల ప్రజలపై EMIల భారం పెరిగింది తప్ప, ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోకి రాలేదు.

కేవలం వడ్డీ రేట్లు పెంచుతూ వెళ్లడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గదని ప్రొఫెసర్ మనోజ్ పంత్ చెప్పారు. ఇకపై, వడ్డీ రేట్లను పెంచడం గురించి ఆర్‌బీఐ ఆలోచించకూడదని, లేకుంటే దేశంలో వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ ద్రవ్యోల్బణం ఆహార ఉత్పత్తుల వల్ల వచ్చిందేనని, వడ్డీ రేట్లను పెంచడం ద్వారా దానిని నియంత్రించలేమని ఆయన చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులు, ముఖ్యంగా డీజిల్ ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని వివరించారు. అధిక ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం చివరి వరకు, అంటే శీతాకాలం వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు.

ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తమ వడ్డీ రేట్లను పెంచడంతో, విదేశీ పెట్టుబడులు భారత్‌ నుంచి బయటకు వెళ్లకుండా మన దేశంలోనూ వడ్డీరేట్లను RBI పెంచుతోందని ప్రొఫెసర్ మనోజ్ పంత్ చెప్పారు. ఆర్‌బీఐ తదుపరి ద్రవ్య విధాన సమీక్ష (MPC) కొత్త ఆర్థిక సంవత్సరంలో (2023-24) జరుగుంది. ఏప్రిల్ 3, 5, 6 తేదీల్లో ఎంపీసీ సమావేశం ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో, రెపో రేటును ఆర్‌బీఐ ఇంకా పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.

ప్రధాన ద్రవ్యోల్బణం సమస్యను పెంచింది
2023 ఫిబ్రవరి 12, శనివారం నాడు జరిగిన బోర్డు సమావేశం తరువాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు దాదాపు 5.3 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ముడి చమురు ధరల్లో తగ్గుదల ఉంటే, మన దేశం ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Gold Price: రికార్డు గరిష్టాల నుంచి భారీగా పడిపోతున్న బంగారు ధరలు; పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు కారణాలేంటి?
రికార్డు గరిష్టాల నుంచి భారీగా పడిపోతున్న బంగారు ధరలు; పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు కారణాలేంటి?
Steel Price: స్టీల్‌ ధరలకు రెక్కలు! సంక్షోభంలో భారత్ ఉక్కు పరిశ్రమ! ప్రమాదంలో MSME రంగాలు!
స్టీల్‌ ధరలకు రెక్కలు! సంక్షోభంలో భారత్ ఉక్కు పరిశ్రమ! ప్రమాదంలో MSME రంగాలు!
New Ticket Cancellation Refund Rules: రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!
రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget