By: Swarna Latha | Updated at : 05 May 2024 05:58 PM (IST)
లిస్టింగ్ ముందే రూ.520 లాభంలో ఐపీవో, గ్రే మార్కెట్లో సంచలనం ( Image Source : ABP Live )
TBO Tech IPO News: భారత స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఐపీవోల హవా కొనసాగుతోంది. కరోనా తర్వాత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది ఐపీవోలతో తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను పొందేందుకు మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదొడుకులతో ట్రేడింగ్ చేయటం కంటే రెండు వారాల్లో డబ్బును రెట్టింపు చేస్తున్న ఐపీవోపై మనసు పారేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక కంపెనీ ఐపీవో మాత్రం ఇంకా ప్రారంభం కూడా కాకుండానే గ్రేమార్కెట్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.
ఐపీవో వివరాలు..
టిబిఓ టెక్ కంపెనీ ఈవారం మార్కెట్లో సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇది మే 8న ప్రారంభమై మే 10న ముగియనుంది. కంపెనీ షేర్ల కేటాయింపు మే 13, 2024న ముగియనుంది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 16 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. తాజా ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ విక్రయ ధరను షేరుకూ రూ.875-920గా ఉంచింది. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనేందుకు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర లెక్కన కనీసం రూ.14,720 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయితే మరో మూడు రోజుల్లో తెరుచుకోవటానికి ముందే ఐపీవో గ్రేమార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందనతో రోజుకో రికార్డు సృష్టిస్తోంది.
లాభాల సునామీ..
ఇన్వెస్టర్స్ గెయిన్ తాజా డేటా ప్రకారం ఆదివారం నాడు టిబిఓ టెక్ ఐపీవో షేరు గ్రేమార్కెట్లో అత్యధికంగా ఒక్కోటి రూ.520 ప్రీమియం ధరను పలుకుతున్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగినట్లయితే కంపెనీ షేర్లు జాబితా రోజున రూ.1,440 వద్ద మార్కెట్లలో తెరుచుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఐపీవోకు దరఖాస్తు చేసుకుని అలాట్మెంట్ సమయంలో షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సుడి తిరగనుంది. ఎందుకంటే కేవలం లిస్టింగ్ సమయంలో బలమైన ప్రీమియం కారణంగా 56.52 శాతం లాభాన్ని నిమిషాల్లో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పొందుతారు. ప్రస్తుతం ఐపీవోకి యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్మన్ సాచ్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్లను లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటుగా ఆఫర్ ఫర్ సేల్ కూడా కలిగి ఉంది. ఐపీవో ఇండియన్ మార్కెట్ల నుంచి రూ.1,550.81 కోట్లను సమీకరించాలనే లక్ష్యతో ఈవారం మార్కెట్లోకి వస్తోంది. 2006లో ప్రారంభించబడిన కంపెనీ ప్రధానంగా టూరిజం రంగంలోని కంపెనీలకు, వ్యక్తులకు సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి ప్రమోటర్లుగా అంకుష్ నిజవాన్, గౌరవ్ భట్నాగర్, మనీష్ ధింగ్రా, అర్జున్ నిజవాన్ ఉన్నారు. దీనికి తోడు కంపెనీ బలమైన ఆర్థిక గణాంకాలతో లాభదాయకతను ప్రదర్శించటం ఇన్వెస్టర్లను ఐపీవో దిశగా ఆకర్షిస్తోంది.
Hexaware Technologies IPO: హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఇదే - ఫిబ్రవరి 12 నుంచి లైవ్
New IPOs: డబ్బుతో సిద్ధంగా ఉండండి, త్వరలో 6 కొత్త IPOలు ప్రారంభం
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
New Income Tax Bill: పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు - కీలక మార్పులు ఇవే