Gold-Silver Price: న్యూ ఇయర్ వేళ బెంబేలెత్తించిన బంగారం రేటు, వెండి మాత్రం కాస్త ఊరట
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది.
![Gold-Silver Price: న్యూ ఇయర్ వేళ బెంబేలెత్తించిన బంగారం రేటు, వెండి మాత్రం కాస్త ఊరట Gold Silver Price Today 1 January 2023 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati Gold-Silver Price: న్యూ ఇయర్ వేళ బెంబేలెత్తించిన బంగారం రేటు, వెండి మాత్రం కాస్త ఊరట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/01/8d45ee425984b11b51042d033e247e5a1672539017602234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా ఊహించని విధంగా బంగారం ధర (Todays Gold Rate) పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. నేడు పది గ్రాములకు ఏకంగా రూ.250 వరకూ బంగారం ధర ఎగబాకింది. నేడు వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.50,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.55,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.71,300 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,300 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.50,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.55,200 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.51,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,960 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,200 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర కూడా నేడు విపరీతంగా పెరిగింది. ఏకంగా గ్రాముకు రూ.430 చొప్పున ఎగబాకింది. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.28,430 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)