అన్వేషించండి

IT Returns 2022: చివరి రోజు కుప్పలు తెప్పలుగా ఐటీఆర్ దరఖాస్తులు, ఫైల్ చేయని వారికి జరిమానా !

IT Returns 2022: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు కావడం వల్ల పన్ను చెల్లింపు దారులు ఐటీ పోర్టల్ కు పోటెత్తారు. ఆఖరి రోజునే మొత్తం 68 లక్షల రిటర్నులు దాఖలు చేశారు.  

IT Returns 2022: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు గడువు జులై 31వ తేదీతో ముగిసింది. అందుకే పన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌కు పోటెత్తారు. గడువు పెంచేందుకు ప్రభుత్వం అంతగా సుముఖత చూపకపోవడంతో.. ఆదివారం ఒక్క రోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలు అయినట్లు ఐటీ విభాగం వెల్లడించింది. శనివారం వరకు 5.10 కోట్లకుపైగా దాఖలైన విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం రాత్రి 11 గంటల వరకు చూస్తే ఈ సంఖ్య దాదాపు 5.78 కోట్లకు చేరింది. 

మరో గంట సమయంలోనే ఇంకో 5 లక్షలు దాఖలు కావొచ్చు..

గడువు ముగిసేందుకు మరో గంట సమయం ఉన్నందున ఇంకో 5 లక్షల వరకు దాఖలు కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంటే దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్ లు దాఖలు కావచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పొడగించిన గడువు తేదీ 2021 డిసెంబర్ 31 వరకు చూస్తే దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్ లు దాఖలు అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి గడువు పొడగించినందున 6 లక్షల మంది జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 19.53 లక్షలు దాఖలు అయ్యాయి. తదుపరి ప్రతి గంటలు 4 లక్షలకు పైగా.. సాయంత్రం 5, 6 గంటల మధ్య అత్యధికంగా 5.17 లక్షల ఐటీఆర్ లు దాఖలు అయ్యాయి. 

అపరాధ రుసుము తప్పనిసరి...

2021-22కు సంబంధించి అపరాధ రుసుము లేకుండా జులై 31లోగా ఐటీఆర్ లు దాఖలు చేయాలి. తదుపరి డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో దాఖలు చేయవచ్చు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000 అంతకు మించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి ఐటీఆర్ దాఖలు చేయాలి.

వెబ్ సైట్‌లో లోపాలు ఇప్పటికీ సరిచేయలేదు

రిటర్నుల దాఖలుకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఇప్పటికీ ఐటీ వెబ్ సైట్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేయకుండా గడువులోపు దరఖాస్తు చేయాలని ఒత్తిడి పెంచడం సరికాదని అంటున్నారు. రోజుకు కోటి మంది రిటర్నులు దాఖలు చేసినా పోర్టల్ లో ఎలాంటి సమస్యా ఉండదని తరుణ్ బజాజ్ పేర్కొనడం గమనార్హం. 

తేదీ పొడగించే అవకాశాలు తక్కువే..

ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ పొడగించే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆడిట్ పరిధిలోకి వచ్చే వారు రిటర్నులు దాఖలు చేసేందుకకు అక్టోబర్ 31 దాకా సమయం ఉంటుంది. గడువు ముగిసే నాటికి మొత్తం రిటర్నుల సంఖ్య క్రితం అసెస్ మెంట్ ఏడాది స్థాయికి చేరే వీలు ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ గడువు పొడగించే అకాశం ఉందని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

VerSe Innovation: అంతర్జాతీయ స్థాయికి ఎదిగే లక్ష్యంతో వెర్సె ఇన్నోవేషన్ - బోర్డులో డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్ పి.ఆర్. రమేష్‌
అంతర్జాతీయ స్థాయికి ఎదిగే లక్ష్యంతో వెర్సె ఇన్నోవేషన్ - బోర్డులో డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్ పి.ఆర్. రమేష్‌
Income Tax: ఆదాయపు పన్నును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చా? లాభమా, నష్టమా
ఆదాయపు పన్నును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చా? లాభమా, నష్టమా
Passive Income: ప్రతిరోజూ కష్టపడకుండా ఆదాయం పొందండి! అందుకు సులభమైన పద్ధతులు ఇవే
ప్రతిరోజూ కష్టపడకుండా ఆదాయం పొందండి! అందుకు సులభమైన పద్ధతులు ఇవే
Rupee Crash: రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget