అన్వేషించండి

Byjus India CEO: 'బైజూస్‌ ఇండియా'కు కొత్త సీఈవో - పాస్‌ మార్కులు తెచ్చుకుంటారో!

Byjus India CEO: ఎడ్యూటెక్‌ కంపెనీ బైజూస్‌ (Byjus) అగ్రనాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సీనియర్‌ ఉద్యోగి అర్జున్‌ మోహన్‌ భారత వ్యాపారానికి సీఈవోగా ఎంపికయ్యారు.

Byjus India CEO:

ఎడ్యూటెక్‌ కంపెనీ బైజూస్‌ (Byjus) అగ్రనాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సీనియర్‌ ఉద్యోగి అర్జున్‌ మోహన్‌ భారత వ్యాపారానికి సీఈవోగా ఎంపికయ్యారు. మృణాల్‌ మోహిత్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ అప్పుల భారంతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే.

వ్యక్తిగత కారణాలతోనే మోహిత్‌ కంపెనీ నుంచి వైదొలగుతున్నట్టు బైజూస్‌ తెలిపింది. గతేడాది మే నుంచి ఆయన భారత వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. కంపెనీ స్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ (Byju Raveendran) అంతర్జాతీయ వ్యాపారంపై దృష్టి సారించడంతో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు.

'అర్జున్‌ మోహన్‌ బైజూస్‌లోకి తిరిగి రావడం కంపెనీ లక్ష్యాలు, మున్ముందు లభించే అసమాన అవకాశాలపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మేం తిరిగి నిలదొక్కుకొనేందుకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ఎడ్యూటెక్‌ వ్యాపారంలో మా స్థానాన్ని పటిష్ఠం చేస్తుంది' అని బైజూ రవీంద్రన్‌ అన్నారు.

నిజానికి అర్జున్‌ గతంలో బైజూస్‌లో కీలక పాత్ర పోషించారు. 2020 వరకు కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. రోనీ స్క్రూవాలా స్థాపించిన అప్‌గ్రేడ్‌కు సీఈవోగా వెళ్లడంతో రాజీనామా చేశారు. అయితే రవీంద్రన్‌ అంతర్జాతీయ వ్యాపార నిర్వహణలో బిజీగా ఉండటంతో ఈ ఏడాది జులైలో ఆయన మళ్లీ బైజూస్‌కు తిరిగొచ్చారు.

బయటకు వెళ్లిపోతున్న మోహిత్‌ బైజూస్‌ స్థాపక బృందంలో కీలక సభ్యుడు. ఇద్దరు స్థాపకులతో కలిసి పదేళ్ల పాటు పనిచేశారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌గా పనిచేస్తున్న ఆయన 2016లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు.

'బైజూస్‌ నేడున్న అత్యున్నత స్థితికి రావడానికి స్థాపక బృందం శ్రమే కారణం. మృణాల్‌ సేవలు మా కంపెనీపై చెరగని ముద్ర వేశాయి. అతడు బయటకు వెళ్లిపోవడం మాకు సంతోషంతో కూడిన బాధను కలిగించింది. మేమంత కలిసి సాధించనదానికి నేను గర్వపడుతున్నాను' అని రవీంద్రన్‌ తెలిపారు. 'అత్యంత ముఖ్యమైన అంశాల్లో నేను మృణాల్‌ సలహాలు తీసుకొనేవాడిని. వ్యక్తిగతంగా అతడు నాకెంతో ఆప్తుడు. మిగిలినవి పక్కన పెడితే కంపెనీ పరివర్తన విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉంది. బైజూస్‌ వృద్ధి పథంలో పయనిస్తుంది' అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బైజూస్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రుణాలు తిరిగి చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 1.2 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లింపులో రుణదాతలతో వివాదం కొనసాగుతోంది.

మరోవైపు భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం చుక్కలు చూపించాయి. ఆరంభం నుంచి నేల చూపులు చూశాయి. క్రూడాయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకడం, డాలర్‌ ఇండెక్స్‌ విపరీతంగా పెరగడం, యూఎస్‌ బాండ్‌ యీల్డుల పెరుగుదల వంటివి పతనానికి ప్రధాన కారణాలు. వీటికి ద్రవ్యోల్బణం, వినియోగ వస్తువుల ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం వంటివి దోహదం చేశాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 231 పాయింట్లు తగ్గి 19,901 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 796 పాయింట్లు పతనమై 66,800 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలహీనపడి 83.08 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు ఒక్క రోజే రూ.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Summer Business Tips: తక్కువ పెట్టుబడితో ఈ వేసవిలో స్టార్ట్ చేయదగిన భారీ డిమాండ్ ఉన్న బిజినెస్‌లు ఇవే! 
తక్కువ పెట్టుబడితో ఈ వేసవిలో స్టార్ట్ చేయదగిన భారీ డిమాండ్ ఉన్న బిజినెస్‌లు ఇవే! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget