అన్వేషించండి

Cm Kcr: గోల్ మాల్ గోవింద బడ్జెట్... బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తాం... సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. పేద ప్రజలకు గుండు సున్నా అని కేంద్రం బడ్జెట్ పై మండి పడ్డారు. ఆర్థిక మంత్రి అసత్యాలు చదివారన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేదని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఉపయోగంలేని బడ్జెట్ వల్ల ఉపయోగం లేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ చాలా దారుణమైన బడ్జెట్ అన్నారు. బడ్జెట్‌ పెట్టే టైంలో మహాభారతంలోని శాంతి పర్వంలోని ఓ శ్లోకాన్ని ఆర్థికమంత్రి కోట్ చేశారని గుర్తు చేశారు. ప్రజలు బాగుండాలని దాని అర్థమని కేసీఆర్ చెప్పారు. ఆమె శాంతి పర్వంలోని శ్లోకం చెప్పి అసత్యాలే చదివారని మండిపడ్డారు. బడ్జెట్ లో అందరికీ గుండు సున్నా అని సీఎం కేసీఆర్ అన్నారు. కల్ల, డొల్ల ప్రచారం, గోల్ మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏమీలేదన్నారు. పేద ప్రజలకు గుండు సున్నా అని కేంద్రం బడ్జెట్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. 

బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తాం

కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సిగ్గూశరం లేదన్నారు సీఎం కేసీఆర్. భారత్‌ అభివృద్ధి చెందాలంటే బీజేపీని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని పిలుపునిచ్చారు.  ప్రభుత్వాన్ని దింపేందుకు ఉద్యమిస్తామన్నారు. ప్రధానమంత్రి మోదీ చాలా కురచ బుద్ది ఉన్న వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  భవిష్యత్‌లో కరోనా లాంటి వైరస్‌లు విజృంభించ వచ్చని అంచనాలు ఉన్నా కేంద్రం వైద్యారోగ్యశాఖకు పైసా పెంచలేదని విమర్శించారు. బ్యాంకులను అప్పుల్లో ముంచిపోయిన వాళ్లకు సబ్సిడీలు ఇస్తారు. కార్పొరేట్‌ శక్తులను పెంచి పోషించడం, మత పిచ్చి లేపి మంది మీద పడి ఏడ్చి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 

లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు

ప్రపంచం ఆకలి సూచిలో భారత్ 101 స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాకిస్థాన్, నేపాల్‌ కంటే వెనుకబడి ఉన్నామన్నారు. 115 దేశాల్లో సర్వే చేస్తే 101లో భారత్‌ ఉందన్నారు. ప్రధాని మోదీ ఏం చేస్తున్నాట్టో చెప్పాలన్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అమెరికాలో ఉన్న వారికి బ్రోకర్లుగా పని చేస్తున్నారా అంటూ నిలదీశారు. 2022కి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పిందని ఆ విషయం ఏమందైన్నారు. అన్ని ధరలు పెంచి రైతు పెట్టుబడిని డబుల్ చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ ఇళ్లు అన్నది ఏమైందో చెప్పాలని నిలదీశారు. బ్లాక్‌ మనీ బయటకు తీసుకొస్తామని మనిషికి రూ.పదిహేను లక్షలు ఇస్తామని చెప్పిన మాట సంగతి ఏంటని మోదీని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. 

గుజరాత్ మోడల్ విఫలమైంది 

అత్యంత దారుణమైన విద్యుత్ పాలసీ అమలుచేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారన్నారు. 'గుజరాత్‌ మోడల్‌ పేరుతో మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎనిమిదో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎనభై శాతం కాలం పరిపాలించిన మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కరోనాతో దేశం అల్లకల్లోలమైపోయింది. లక్షల మంది ప్రజలు కనీసం రైలు టికెట్‌ కూడా ఇవ్వలేదు. నడుచుకుంటూ వెళ్తూ వేల మంది చనిపోయారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయలేదు. ఎస్సీ, ఎస్టీల జనాభాపై కేంద్రం చెప్పిన లెక్కలు తప్పు అన్నారు కేసీఆర్. తమ బడ్జెట్‌లో వాళ్లకు ఖర్చు పెట్టినంత కూడా కేంద్రం వాళ్లకు కేటాయించలేదన్నారు. ఆందోళన చేసిన రైతుల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. ఇదే ప్రధానమంత్రి రైతులకు ఇచ్చిన గిఫ్ట్‌. గ్రామీణ ఉపాధి హామీపై పాతికవేల కోట్లు కోత పెట్టారు' సీఎం కేసీఆర్ ఆరోపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget 2026-27: నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
AP Assembly Session: ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget 2026-27: నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
నేడు .36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Rashmika Mandanna : ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
Eating Eggs vs Egg Hair Mask : జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేక మాస్క్ వేస్తేనా? నిపుణుల సూచనలివే
జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేదా హెయిర్ మాస్క్‌ వేస్తే ఒత్తుగా పెరుగుతుందా?
Honda Activa February Sales: స్కూటర్ల అమ్మకాల్లో హోండా యాక్టివా జోరు – ఫిబ్రవరి 2026 టాప్ మోడల్స్ ఇవే!
స్కూటర్ల అమ్మకాల్లో హోండా యాక్టివా జోరు – ఫిబ్రవరి 2026 టాప్ మోడల్స్ ఇవే!
Telangana Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
Okra Water : బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే
బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే
Embed widget