అన్వేషించండి

Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే

Tata Docomo Case: కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ పరిహారం చెల్లించింది టాటా సంస్థ. అయితే అలా చేయడం సేవ కిందకు వస్తుందని జీఎస్టీ కట్టాలని నోటీసులు ఇచ్చారు. కానీ కోర్టు తిప్పికొట్టింది.

Bombay HC quashes 1524 cr IGST demand: కార్పొరేట్ వివాదాల పరిష్కార ప్రక్రియలో పన్ను అధికారుల వింత పోకడలకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టాటా సన్స్, జపాన్ టెలికాం దిగ్గజం ఎన్టీటీ డోకోమో  మధ్య జరిగిన  సెటిల్‌మెంట్‌పై జీఎస్టీ వసూలు చేయాలన్న అధికారుల ప్రయత్నాన్ని కోర్టు హాస్యాస్పదం  అని కొట్టిపారేసింది. ఈ తీర్పు కేవలం టాటా సంస్థకే కాకుండా, దేశీయ కార్పొరేట్ రంగానికి పెద్ద ఊరటనిచ్చింది.

 ఇన్వెస్ట్‌మెంట్ నుంచి ఇంటర్నేషనల్ కోర్టు వరకు 

ఈ వివాదం మూలాలు 2009లో ఉన్నాయి. టాటా టెలీసర్వీసెస్‌లో డోకోమో భారీ పెట్టుబడి పెట్టింది. అయితే, వ్యాపారం నష్టాల్లో సాగడంతో ఒప్పందం ప్రకారం తన వాటాను విక్రయించి బయటకు వెళ్లాలని డోకోమో నిర్ణయించుకుంది. షేర్ల ధర విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ వివాదం లండన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి  చేరింది. అక్కడ డోకోమోకు అనుకూలంగా తీర్పు రావడంతో, టాటా సన్స్ సుమారు 8,450 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు జోక్యంతో ఈ చెల్లింపులు పూర్తయ్యాయి. డోకోమో తన అంతర్జాతీయ వ్యాజ్యాలను ఉపసంహరించుకుంది.

కేసు వేయకపోవడం ఒక సేవేనని పన్ను 

ఇక్కడే జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఒక వినూత్నమైన వాదనను తెరపైకి తెచ్చింది. డోకోమో తన కేసులు ఉపసంహరించుకోవడాన్ని ఒక సేవగా పరిగణించింది. జీఎస్టీ చట్టంలోని ఒక చర్యకు దూరంగా ఉండటానికి అంగీకరించడం అనే నిబంధనను దీనికి అన్వయించింది. అంటే, టాటా డబ్బులు ఇచ్చింది కాబట్టే డోకోమో కేసులు వేయకుండా ఆగిపోయిందని, కాబట్టి ఆ పరిహారం మొత్తంపై 18 శాతం చొప్పున 1,524 కోట్లు పన్ను చెల్లించాలని టాటా సన్స్‌కు నోటీసులు జారీ చేసింది.  

చట్టాన్ని అతిగా ఊహించకండని హైకోర్టు ఆగ్రహం

ఈ నోటీసులను సవాలు చేస్తూ టాటా సన్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ జీఎస్ కుల్కర్ణి, జస్టిస్ ఆర్తీ సాఠేలతో కూడిన ధర్మాసనం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించిన పరిహారాన్ని  వ్యాపార లావాదేవీ గా చూడటం అసంబద్ధమని తేల్చిచెప్పింది.  ఒక కోర్టు తీర్పును అమలు చేయడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ, అది ఒక సేవ కాదు. ఇలాంటి వాటికి పన్ను ముడిపెట్టడం హాస్యాస్పదం  అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పన్ను అధికారులు చట్టంలోని నిబంధనలను తమకు నచ్చినట్లుగా, అతిగా ఊహించుకుంటూ అన్వయించకూడదని గట్టిగా హెచ్చరించింది.

కార్పొరేట్ రంగానికి దిక్సూచిగా ఈ తీర్పు

ఈ తీర్పుతో టాటా సన్స్‌కు రూ.1,524 కోట్ల భారీ భారం తప్పడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు ఒక స్పష్టత లభించింది. న్యాయపరమైన సెటిల్‌మెంట్లు, నష్టపరిహారాలు, కోర్టు వెలుపల జరిగే రాజీ ఒప్పందాలు సేవల పరిధిలోకి రావని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది పన్నుల పేరుతో కంపెనీలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, విదేశీ పెట్టుబడిదారుల్లో భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ కీలక తీర్పు ద్వారా, కోర్టు డిక్రీలు ,  చట్టపరమైన పరిహారాలు జీఎస్టీ పరిధిలోకి రావనే స్పష్టత రావడంతో, సివిల్ ,  కార్పొరేట్ వివాదాల్లో చిక్కుకున్న అనేక కంపెనీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అధికారుల ట్యాక్స్ అడ్వెంచర్ కు న్యాయస్థానం ముకుతాడు వేసిన ఈ కేసు, పన్నుల పరిధి ఎక్కడివరకు ఉండాలనే అంశంపై ఒక మైలురాయిగా నిలిచిపోనుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget