అన్వేషించండి

Indian and Pakistani Companies: భారత్‌లో ఏర్పాటైన ఈ కంపెనీలు పాకిస్తాన్ కోసం డబ్బు సంపాదిస్తున్నాయా?

Indian and Pakistani Companies:భారత్ పాక్ విభజన తర్వాత భారత్‌లో స్థాపించిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కు వెళ్ళాయి. ఆ కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Indian and Pakistani Companies: 1947కి ముందు, భారతదేశం- పాకిస్థాన్ విభజన జరగక ముందు, భారతదేశంలో అనేక ప్రసిద్ధ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. విభజన తర్వాత ఈ కంపెనీలు కూడా విడిపోయాయి. అలాంటి కొన్ని కంపెనీలు ఇప్పటికీ పాకిస్థాన్ కోసం డబ్బు సంపాదిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

వ్యాపారంపై విభజన ప్రభావం

1947లో భారతదేశ విభజన కేవలం భూమిని, ప్రజలను మాత్రమే కాకుండా పరిశ్రమలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలను కూడా విభజించింది. పనిచేస్తున్న వ్యాపారాలు ఏదో ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది లేదా తమ కార్యకలాపాలను విభజించుకోవాల్సి వచ్చింది. దీని ఫలితంగా, ముంబై, ఢిల్లీ, లాహోర్ వంటి నగరాల్లో ప్రారంభమైన అనేక కంపెనీలు వేర్వేరు యాజమాన్యాలు, చట్టపరమైన నిర్మాణాల కింద భారతదేశం, పాకిస్థాన్‌లలో స్వతంత్రంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి.

హమ్‌దర్ద్ లాబొరేటరీస్

హమ్‌దర్ద్ లాబొరేటరీస్ 1906లో ఢిల్లీలో హకీమ్ హాఫిజ్ అబ్దుల్ మజీద్ ఏర్పాటు చేసిన యునాని ఔషధ క్లినిక్‌. విభజన తర్వాత, ఆయన చిన్న కుమారుడు హకీమ్ మొహమ్మద్ సయీద్ 1948లో కరాచీకి వెళ్లి హమ్‌దర్ద్ పాకిస్థాన్‌ను స్థాపించారు.

నేడు, హమ్‌దర్ద్ ఇండియా, హమ్‌దర్ద్ పాకిస్థాన్ పూర్తిగా స్వతంత్ర ఛారిటబుల్ ట్రస్ట్‌లుగా పనిచేస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన ప్రసిద్ధ ఉత్పత్తి 'రూహ్ అఫ్జా' రెండు దేశాలలో వేర్వేరుగా తయారవుతోంది. ఏ యూనిట్ కూడా మరొకదాని కోసం డబ్బు సంపాదించదు, రెండూ తమ తమ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమంలో లాభాలను తిరిగి పెట్టుబడిపెడతాయి.

హబీబ్ బ్యాంక్ లిమిటెడ్

హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ 1941లో ముంబైలో హబీబ్ కుటుంబంతో మహమ్మద్ అలీ జిన్నా అభ్యర్థన మేరకు ఏర్పాటైంది. పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత, బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని కరాచీకి మార్చేసింది. తర్వాత పాకిస్థాన్ మొదటి కమర్షియల్ బ్యాంక్‌గా మారింది. 1974లో జాతీయం చేసిన తర్వాత, హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ ఇప్పుడు పాకిస్థాన్‌లోనే అతిపెద్ద బ్యాంక్‌గా మారింది. ఈ బ్యాంక్ 25కుపైగా దేశాల్లో పనిచేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేడు దీనికి భారతదేశంతో ఎటువంటి కార్యాచరణ లేదా ఆర్థిక సంబంధం లేదు.

అలైడ్ బ్యాంక్

ఈ బ్యాంక్ 1942లో లాహోర్‌లో ఆస్ట్రేలియా బ్యాంక్‌గా ప్రారంభమైంది. విభజన తర్వాత అనేక భారతీయ బ్యాంకులు పాకిస్థాన్ నుంచి బయటకు వెళ్లడంతో, అలైడ్ బ్యాంక్‌కు వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభించింది. బ్యాంక్ 1974లో జాతీయం చేశారు. ఆ తర్వాత ప్రైవేటీకరించారు.  

డాల్డా

డాల్డా బ్రాండ్ 1937లో బ్రిటిష్ ఇండియాలో హిందుస్థాన్ వనస్పతి మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా పరిచయమైంది. విభజన తర్వాత, డాల్డా పాకిస్థాన్‌లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. 2000ల ప్రారంభంలో, యూనిలీవర్ రెండు దేశాలలో డాల్డా బ్రాండ్‌ను వేర్వేరుగా విక్రయించింది. భారతదేశంలో దీనిని బంజ్ లిమిటెడ్ కొనుగోలు చేసింది, పాకిస్థాన్‌లో ఇది వెస్ట్‌బరీ గ్రూప్ ఆధీనంలోకి వెళ్లింది. వెస్ట్‌బరీ గ్రూప్ దీని పేరును డాల్డా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చింది.

ఈ కంపెనీలు నేడు పాకిస్థాన్ కోసం డబ్బు సంపాదిస్తున్నాయా?

వాస్తవానికి, ఈ కంపెనీలు భారతదేశం తరపున పాకిస్థాన్ కోసం డబ్బు సంపాదించడం లేదు. ఎందుకంటే విభజన తర్వాత ఆ కంపెనీలు పాకిస్థాన్‌లోనే స్థాపితమయ్యాయి, కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ఆర్థిక కార్యకలాపం ఆ దేశ చట్టాలకు లోబడి జరుగుతున్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Income Tax: ఆదాయపు పన్నును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చా? లాభమా, నష్టమా
ఆదాయపు పన్నును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చా? లాభమా, నష్టమా
Passive Income: ప్రతిరోజూ కష్టపడకుండా ఆదాయం పొందండి! అందుకు సులభమైన పద్ధతులు ఇవే
ప్రతిరోజూ కష్టపడకుండా ఆదాయం పొందండి! అందుకు సులభమైన పద్ధతులు ఇవే
Rupee Crash: రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
Petrol Diesel Excise Duty: పెట్రోల్, డీజిల్‌పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?
పెట్రోల్, డీజిల్‌పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?
Advertisement

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget