అన్వేషించండి

Apple : తెలుగు ఉద్యోగులపై ఆపిల్ ఫైర్ - మోసం చేశారంటూ 185 మందిపై వేటు

Apple : ఆపిల్ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మోసపూరిత కార్యకలాపాలపై విచారణ తర్వాత 185 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.

Apple : టెక్ దిగ్గజం ఆపిల్ 185 ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో ఇండియన్ కమ్యూనిటీస్ పేరిట మోసం జరుగుతోందా.. ఆపిల్ సంస్థ నిధులు నిజంగానే పక్కదారి పెట్టాయా అన్న టాపిక్స్ ఇవి చర్చనీయాంశంగా మారాయి. అనేక కారణాలతో భారతీయులు అమెరికా బాట పట్టడం చూస్తూనే ఉంటాం. డబ్బు సంపాదించేందుకు కొందరు, ఫ్యాషన్ తో కొందరు, చదువుకోవాలని కొందరు అమెరికాకు వలస వెళుతుంటారు. ఎక్కువగా అయితే టెక్ రంగంలో ఉద్యోగాల నిమిత్తం వెళతారు. అయితే తెలుగు వారందరినీ షాక్‌కి గురిచేసే వార్త ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారు ఆపిల్ బే ఏరియా కార్యాలయంలో పనిచేస్తోన్న అనేక మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగుల తొలగింపుకు కారణమిదే

దాదాపు 185 మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ విధుల నుంచి తొలగించిందని పలు వార్తా కథనాలు పబ్లిష్‌ అయ్యాయి. వీరిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ్లోబల్ టెక్ జెయింట్ కేవలం తెలుగు వారినే ఎందుకు టార్గెట్ చేసింది అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు ఖర్చును తగ్గించుకునే పనిలో భాగంగా సిబ్బందిని వదిలించుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆపిల్ మాత్రం ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పని చేసినట్టయితే కనిపించట్లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మోసపూరిత కార్యకలాపాలే కారణమా

కంపెనీలో పనిచేస్తోన్న కొందరు తెలుగు అసోసియేట్లు ఆపిల్ అందించే మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారని సమాచారం. ఆపిల్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ఈ సంస్థలు  తమకు విరాళాలు అందించాలని కోరారని... కార్పొరేట్ సామాజిక బాధ్యత ((CSR)లో భాగంగా అదే నాన్‌ప్రిఫిట్ సంస్థలకు ఉద్యోగులు చేసిన విరాళాలను ఆపిల్ సరిపోల్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జరిపిన దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. అయితే కంపెనీలోని తెలుగు ఉద్యోగులు డబ్బు డొనేట్ చేసినట్లే చేసి వాటిని తిరిగి వెనక్కి పొందారని, కంపెనీని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో ఈ అవకతవకలకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఆపిల ఫైనాన్స్ విభాగం గుర్తించింది. 

ఈ క్రమంలో ఆయా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన తెలుగు ఉద్యోగులను రాజీనామా చేయాలని, లేదంటే తామే టర్మినేట్ చేస్తామని ఆపిల్ ఆదేశించింది. దీంతో ఉన్నత స్థాయిలో ఉన్న 185 మంది తెలుగు ఎంప్లాయిస్ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ వ్యక్తులు మూడేళ్ల కాలంలో ఆపిల్ ని సుమారు 1లక్షా 52వేల డాలర్లు మోసం చేశారని శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. ఈ ఘటన అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాల చిత్తశుద్ధిపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఇలాంటి మోసాలకు పాల్పడితే కార్పొరేట్ కంపెనీలు క్షమించవని ఆపిల్ ను చూస్తే తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆపిల్ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, జిల్లా న్యాయవాది కార్యాలయం దీనిపై విచారణను కొనసాగిస్తోంది. తొలగించిన ఉద్యోగులలో చాలా మంది భారతీయ మూలానికి చెందినవారని, కొందరు యూఎస్ లోని తెలుగు కమ్యూనిటీ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు వస్తుండగా.. ఈ వివరాలను అధికారులు ఇప్పటికైతే ధృవీకరించలేదు.

Also Read : Insurance Grace Period : బీమాలో గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? - దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget