అన్వేషించండి

Toll Fee Reduction: రూ.150-200 బదులు ఇప్పుడు టోల్‌ ఫీజు ₹15 మాత్రమే - వెహికల్‌ ఓనర్లకు గుడ్‌ న్యూస్‌

ABP Reshaping India Conclave: దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ అత్యధిక GST చెల్లించేది ఆటోమొబైల్ పరిశ్రమే అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గడ్కరీ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకుందామా?

Nitin Gadkari Announcement On Toll Fee Reduction India: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెహికల్‌ ఓనర్లకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ ఒక సెన్సేషనల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. టోల్‌ ఫీజ్‌ కేవలం 15 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారని ప్రకటించారు. ఈ రోజు (మంగళవారం, సెప్టెంబర్ 16, 2025), ABP రీషేపింగ్ ఇండియా కాన్‌క్లేవ్‌ (ABP Reshaping India Conclave) లో కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వరకు చాలా ముఖ్యమైన విషయాల గురించి నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఈ సందర్భంగా టోల్‌ రుసుముల గురించి కూడా ప్రస్తావించారు. టోల్‌ ఫీజ్‌ రూ. 150-200 కు బదులుగా కేవలం రూ. 15 మాత్రమే వసూలు చేస్తారని, ఇది సామాన్యులకు & దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.         

ఆటో పరిశ్రమ అత్యధిక GST చెల్లిస్తోంది- నితిన్ గడ్కరీ
దేశంలో, లేదా ఏదైనా రాష్ట్రంలో ఎవరైనా అత్యధిక జీఎస్టీ చెల్లిస్తున్నారు అంటే, అది ఆటోమొబైల్ పరిశ్రమేనని నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 15 శాతం ఎక్కువగా అమ్ముడవుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. దీనివల్ల, క్రమంగా కాలుష్యం కూడా సున్నాకి తగ్గుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ & పెట్రోల్ - డీజిల్ కార్ల ధరలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని వివరించారు. అంటే, పెట్రోల్‌-డీజిల్‌ రేట్ల స్థాయికి ఎలక్ట్రిక్ కార్ల రేట్లు దిగొస్తాయని హింట్‌ ఇచ్చారు.​​​​​​​

రోడ్డు ప్రమాదాల గురించి గడ్కరీ ఏం చెప్పారంటే..?
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అనేక అంశాలపై దృష్టి సారించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కార్లకు ఇప్పుడు రెండు & నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లకు బదులుగా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు వస్తున్నాయని గడ్కరీ అన్నారు. బైక్‌ & స్కూటర్‌ రైడర్ల గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. బైకులు, స్కూటర్లు నడుపుతున్న ప్రజలు హెల్మెట్ ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు హెల్మెట్‌లు తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి చేశామని వివరించారు. హెల్మెంట్‌ ధరించకపోతే విధించే జరిమానా కూడా పెంచినట్లు చెప్పారు. ప్రజలు రెడ్ లైట్‌ పడినప్పుడు ఆగడం లేదన్న నితిన్ గడ్కరీ, ప్రజలకు సరైన అవగాహన వచ్చే వరకు ఈ సమస్య ఉంటుందన్నారు.​​​​​​​​​​​​​​​​​​​​       

రోడ్డు భద్రత ప్రచారంలో ప్రతి ఒక్కరూ సాయం చేయడం ముఖ్యమని నితిన్ గడ్కరీ పిలుపున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను ఆపలేకపోయామని అంగీకరించిన కేంద్ర మంత్రి, ప్రజల్లో అవగాహన పెరగకపోతే ప్రభుత్వం ఏం చేయగలదని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు.      

టాప్ హెడ్ లైన్స్

Maruti Baleno on Road Price Hyderabad: హైదరాబాద్‌లో మారుతి బలెనో కంప్లీట్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ఎంత? బ్రేకప్‌, మైలేజ్‌ అండ్‌ ఫీచర్స్‌ ఇవే!
హైదరాబాద్‌లో మారుతి బలెనో కంప్లీట్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ఎంత? బ్రేకప్‌, మైలేజ్‌ అండ్‌ ఫీచర్స్‌ ఇవే!
పెట్రోల్ ఖర్చుల్లో భారీ సేవ్‌! చవకైన హైబ్రిడ్ కార్లు - ఆశ్చర్యపరిచే మైలేజ్
పెట్రోల్ ఖర్చు తగ్గించాలా? తక్కువ ధర హైబ్రిడ్ కార్లు ఇవే, 28km వరకు మైలేజ్!
టాటా సియెర్రా EV పూర్తి డిజైన్ తెలిసిపోయింది - AWD ఆప్షన్, 75kWh బ్యాటరీతో ప్రీమియం ఫీచర్ల తుపాన్‌!
627km రేంజ్‌తో వస్తున్న టాటా సియెర్రా EV! - మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఎంట్రీ, మహీంద్రా BE 6కు గట్టి పోటీ!
647km రేంజ్‌తో స్కోడా Peaq EV ఆవిష్కరణ - ఈ కారు నుంచి ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు
ఈ కారు కొంటే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లి రావచ్చు - మధ్యలో ఛార్జింగ్ టెన్షన్ ఉండదు!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Indian Passport Fee Hike 2026: జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
Embed widget