అన్వేషించండి

E20 Petrol: షెల్‌, జియో BP పెట్రోల్‌లో ఎథనాల్‌ తక్కువేనా? ల్యాబ్‌ రిపోర్ట్‌ చెప్పే ఆసక్తికర విషయాలు

షెల్‌, జియో BP పెట్రోల్‌ను ముంబై ల్యాబ్‌లో టెస్ట్‌ చేయగా, రెండింటిలోనూ ఎథనాల్‌ స్థాయులు లేబుల్‌లో ఉన్నదాని కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఆక్టేన్‌ రేటింగ్స్‌ మాత్రం 97 నుంచి 98.5 RON వరకు ఉన్నాయి.

E20 Fuel: మన దేశంలో, అందరు వాహనదారుల దృష్టి E20 పెట్రోల్‌ నిబంధనల పైనే ఉంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీల తర్వాత, ప్రైవేట్‌ కంపెనీలైన Shell & Jio BP అమ్మే పెట్రోల్‌ను కూడా ల్యాబ్‌లో పరీక్షించారు. ముంబైలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌లో ఈ టెస్టులు జరిగాయి. పరీక్షల్లో ఎథనాల్‌ కంటెంట్‌ (Ethanol Content), ఆక్టేన్‌ రేటింగ్‌ ‍‌(Octane Rating) వంటి కీలక అంశాలను పరిశీలించారు.

ల్యాబ్‌ టెస్టుల్లో ఏం బయటపడింది?
ASTM D4815 పద్ధతిలో గ్యాస్‌ క్రోమాటోగ్రఫీ (GC) టెస్టు ద్వారా ఎథనాల్‌ శాతం కొలిచారు. ఫలితాలు ఇలా ఉన్నాయి:

Shell Regular: 16.7% ఎథనాల్‌

Shell V-Power: 15.1% ఎథనాల్‌

Jio BP E12: 15.7% ఎథనాల్‌

Jio BP E20: 18.7% ఎథనాల్‌

ఈ సంఖ్యల ప్రకారం, ఈ రెండు కంపెనీలు (Shell & Jio BP) E20 లక్ష్యానికి ఇంకా పూర్తిగా చేరుకోలేదు. అంటే, లేబుల్‌లో చెప్పినంత ఎథనాల్‌ ప్రస్తుతం ఈ ఇంధనాల్లో లేదన్నమాట.

ఆక్టేన్‌ రేటింగ్‌ మాత్రం టాప్‌
ఇక, ఆక్టేన్‌ రేటింగ్‌ టెస్టులు ASTM D2699 పద్ధతిలో చేసారు. అన్ని నమూనాల్లో ఆక్టేన్‌ లెవెల్స్‌ 97 నుంచి 98.5 RON మధ్య ఉండి, ప్రభుత్వ రంగ పెట్రోల్‌ సంస్థల కంటే (91-95 RON) ఎక్కువగా వచ్చాయి. Jio BP E20 లో ఎక్కువ ఎథనాల్‌ ఉండడం వల్ల 98.5 RON రేటింగ్‌ వచ్చింది. ఇది హై కంప్రెషన్‌ లేదా టర్బో ఇంజిన్లకు మేలు చేస్తుంది. అయితే, ఎథనాల్‌ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల మైలేజ్‌ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.

షెల్‌ & జియో BP ఫ్యూయల్‌ సోర్సింగ్‌ తేడాలు
షెల్‌కి సొంత రిఫైనరీ ఇండియాలో లేదు. అది IOCL, BPCL లాంటి పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల నుంచి బేస్‌ పెట్రోల్‌ తీసుకుని, తన సొంత యాడిటివ్‌లతో “Regular” & “V-Power” వేరియంట్లుగా విక్రయిస్తోంది. జియో BP మాత్రం రిలయన్స్‌ జామ్‌నగర్‌ రిఫైనరీ నుంచి నేరుగా ఇంధనం తెచ్చుకుని, రెండు గ్రేడ్స్‌ - E12 & E20 - పేరిట అమ్ముతోంది.

ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ E20 రూల్‌ దశల వారీగా అమలవుతోంది. ఇందులో మొదట పబ్లిక్‌ సెక్టార్‌ పెట్రోల్‌ కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వడంతో, షెల్‌కి ఇంకా పూర్తిగా E20 బేస్‌ ఫ్యూయల్‌ అందడం లేదు. అందుకే వాటిలో ఎథనాల్‌ శాతం కొంచెం తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్‌ చెబుతోంది.

E20 వైపు ఇండియా అడుగులు
కేంద్ర ప్రభుత్వం, 2025 ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ తప్పనిసరి చేసింది. అందుకే ప్రైవేట్‌ ఇంధన కంపెనీలు కూడా తమ బ్లెండింగ్‌ యూనిట్లను విస్తరిస్తున్నాయి. జియో BP ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో E20 ఇంధనం అందిస్తోంది. షెల్‌ కూడా రాబోయే నెలల్లో E20కి పూర్తిగా అనుగుణంగా మారనుంది.

ప్రస్తుతం షెల్‌ & జియో BP ఇంధనాల్లో ఎథనాల్‌ లెవెల్స్‌ కొంచెం తక్కువగా ఉన్నా, ఆక్టేన్‌ రేటింగ్‌ మాత్రం గట్టిగా ఉంది. అంటే, పెర్ఫార్మెన్స్‌ బాగానే ఉన్నా, పూర్తి E20 ప్రమాణాలకు ఇంకా సమయం ఉంది. రాబోయే నెలల్లో ఈ కంపెనీల ఫ్యూయల్‌ మిక్సింగ్‌ మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

FIFA వరల్డ్ కప్ గెలిస్తే 100 మందికి ఉచితంగా Jeep Wrangler.. SUV ధర, ఫీచర్ల వివరాలు
FIFA వరల్డ్ కప్ గెలిస్తే 100 మందికి ఉచితంగా Jeep Wrangler.. SUV ధర, ఫీచర్ల వివరాలు
అప్రిలియా SR 125, SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ లాంచ్ - కొత్త క్యామోఫ్లాజ్ లుక్‌తో యూత్‌ కోసమే డిజైనింగ్‌!
స్పోర్టీ డిజైన్‌తో Aprilia ట్రిబ్యూట్ ఎడిషన్లు లాంచ్‌ - కొత్త SR 125, SR 175 ధరలు ఎంతంటే?
Best Electric Scooters: డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఈ స్కూటర్లు నడపవచ్చు, బడ్జెట్ ధరలకే కొనేయండి
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఈ స్కూటర్లు నడపవచ్చు, బడ్జెట్ ధరలకే కొనేయండి
Honda Activa e vs Bajaj Chetak: హోండా యాక్టివా ఇ vs బజాజ్ చేతక్! అసలైన ఈవీ బాస్ ఎవరు?
హోండా యాక్టివా ఇ vs బజాజ్ చేతక్! అసలైన ఈవీ బాస్ ఎవరు?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Embed widget