అన్వేషించండి

Maruti Suzuki e-Vitara: మోదీ చేతుల మీదుగా మారుతి EV విప్లవం - 100 దేశాలకు ఎగుమతి, ₹70,000 కోట్ల భారీ పెట్టుబడి

Maruti Suzuki Battery Plant: మారుతి సుజుకి EV యుగానికి అంకురార్పణ జరిగింది. e-Vitara అసెంబ్లీ లైన్, లిథియం-ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి మొదలైంది. ₹70,000 కోట్ల పెట్టుబడి, 100 దేశాలకు ఎగుమతి లక్ష్యం.

Maruti e-Vitara Launched: భారత ఆటోమొబైల్ రంగంలో చరిత్ర తిరగరాసిన రోజు ఇది!. గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో ప్లాంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేతుల మీదుగా, మారుతి సుజుకి EV విప్లవానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటి లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ప్రొడక్షన్ యూనిట్, EV అసెంబ్లీ లైన్ ప్రారంభం కావడంతో, “మేక్ ఇన్ ఇండియా” భావన సరికొత్త శిఖరాలను చేరింది.

Image

మారుతి సుజుకీ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ SUV e-Vitara లాంచ్ చేసిన ప్రధాని మోదీ, ఆ కార్ల ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. భారత్‌లో తయారైన ఈ SUV.. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, ఇటలీ వంటి యూరప్‌ దేశాలు సహా 100కి పైగా దేశాలకు ఎగుమతి కానుంది. మన దేశం నుంచి ఒక ఎలక్ట్రిక్‌ వెహికల్‌ నేరుగా గ్లోబల్‌ మార్కెట్లను చేరడం ఇదే మొదటిసారి!.

Image

మరింత ముఖ్యంగా, TDS లిథియం-ఐయాన్ బ్యాటరీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ (TDSG) అనే మారుతి అనుబంధ సంస్థ ఇప్పుడు “ఎలక్ట్రోడ్ లెవెల్ లోకలైజేషన్” సాధించింది. అంటే, లిథియం-ఐయాన్ బ్యాటరీల కాథోడ్, అనోడ్ భాగాలు దేశంలో తయారవుతున్నాయి. ఈ విప్లవాత్మక అడుగుతో, భారత్ ఇకపై హైబ్రిడ్ వాహనాల బ్యాటరీల విషయంలో ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. Grand Vitara హైబ్రిడ్ SUV లో స్థానికంగా తయారైన ఇవే సెల్స్‌ను ఉపయోగిస్తారు.

Image

ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రణాళిక
ప్రస్తుతం, హన్సల్పూర్‌లో ప్లాంట్ ఏడాదికి 18 మిలియన్ సెల్స్ ఉత్పత్తి చేస్తోంది. దీని మీద ఇప్పటికే రూ. 4,267 కోట్లు పెట్టుబడి పెట్టారు. వచ్చే రోజుల్లో మరో 12 మిలియన్ సెల్స్ సామర్థ్యం జోడించి, ఉత్పత్తిని మరింత విస్తరించబోతున్నారు.    

Image

హన్సల్పూర్‌లోని ప్రధాన ప్లాంట్‌కి భారీ సామర్థ్యం కూడా ఉంది. ఒక్క ఏడాదిలోనే 7.5 లక్షల వాహనాలు తయారు చేయగల ఈ యూనిట్ ఇప్పుడు మారుతి కంట్రోల్‌లోకి వచ్చింది. దీని ద్వారా EVలతో పాటు పలు మోడళ్ల ఉత్పత్తి మరింత వేగం కానుంది.

Image

“మారుతి నాలుగేళ్లుగా భారత్‌ నుంచి అతి పెద్ద కార్ల ఎగుమతిదారుగా నిలుస్తోంది. ఇక EVలు కూడా అదే స్థాయిలో ఎగుమతి అవుతాయి. ప్రపంచంలో నడిచే EVల మీద ‘Made in India’ ముద్ర మనకు గర్వకారణం అవుతుంది” - ప్రధాని నరేంద్ర మోదీ

“తదుపరి 5 నుంచి 6 సంవత్సరాల్లో, భారత్‌లోనే ₹70,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం. EVలు, హైబ్రిడ్లలో టెక్నాలజీ, ప్రొడక్షన్ సామర్థ్యాన్ని మరింత పెంచుతాం” - సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ తోషిహిరో సుజుకి

మొదటి లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ప్రొడక్షన్ యూనిట్, EV అసెంబ్లీ లైన్ ప్రారంభించిన ఘట్టాన్ని కేవలం ఒక ప్లాంట్ ప్రారంభోత్సవంగా మాత్రమే కాదు, అంతకుమించిన సందర్భంగా చూడాలి. భారత్‌ గ్లోబల్ EV మ్యాప్‌లో తనదైన ముద్ర వేసిన రోజు ఇది. స్థానిక ఉత్పత్తి, భారీ ఎగుమతులు, అంతర్జాతీయ పెట్టుబడులు కలిసి దేశాన్ని ఎలక్ట్రిక్ భవిష్యత్తులోకి నడిపిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Best Electric Scooters Under 50000: సామాన్యుడికి అందుబాటులో 50 వేల రూపాయల్లో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు! రేంజ్‌, ఫీచర్స్‌లో సూపర్‌!
సామాన్యుడికి అందుబాటులో 50 వేల రూపాయల్లో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు! రేంజ్‌, ఫీచర్స్‌లో సూపర్‌!
Tata Punch EMI: ఏప్రిల్‌లో ఎక్కువగా అమ్ముడుపోయిన టాటా పంచ్‌ కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి? ఈ మోడల్ ఏ కార్లతో పోటీ పడుతుంది?
ఏప్రిల్‌లో ఎక్కువగా అమ్ముడుపోయిన టాటా పంచ్‌ కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి? ఈ మోడల్ ఏ కార్లతో పోటీ పడుతుంది?
Best Mileage Bikes India: మధ్యతరగతి భరోసా తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 24 బైక్‌లు ఇవే!
మధ్యతరగతి భరోసా తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 24 బైక్‌లు ఇవే!
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget