అన్వేషించండి

Andhra Pradesh: ప్రాణనష్టం జరిగాక బోటులో చంద్రబాబు షికార్లు - ఏపీ సీఎంపై వైసీపీ సంచలన పోస్ట్

Chandrababu | ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించారు. విజయవాడలో స్వయంగా రంగంలోకి దిగి వరద పరిస్థితులను పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు.

Heavy Rains In Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగానే, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు, తుఫాను గురించి సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)కు ముందే తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే రాష్ట్రంలో ప్రాణనష్టం సంభవించిందని ఆరోపిస్తూ వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే, ఏపీలో ప్రాణ నష్టం ఉండేది కాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

వర్షాల గురించి తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదు 
‘రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు చంద్రబాబుకు ముందే  తెలుసు. తుఫాను వల్ల ఏఏ జిల్లాలో ఎంత వర్షపాతం కురుస్తుందో కూడా వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయినా చంద్రబాబు సర్కార్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాని ఫలితమే 10 మందికి పైగా చనిపోవడానికి, విజయవాడ మునిగిపోవడానికి కారణం. రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నా ప్రభుత్వం యంత్రాంగం ఎలాంటి ముందస్తు  చర్యలు తీసుకోకపోవడం దారుణం.

రాజకీయాల్లో తాను చాలా సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు.. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోగా జరగాల్సిన నష్టం అంతా జరిగాక ఇప్పుడు తగుదునమ్మా అంటూ బోటులో షికార్లు చేస్తున్నాడు. చంద్రబాబు పర్యటన దృశ్యాల‌ను ఎల్లోమీడియా జాకీలు పెట్టి లేపుతోంది. మ‌న రాష్ట్రానికి ఇలాంటి ముఖ్య‌మంత్రి ఉండ‌డం రాష్ట్ర  ప్ర‌జ‌ల దౌర్భాగ్యం’ అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Also Read: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ లు ఇవే

ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి కావాల్సిన సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏపీకి స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. విజయవాడలో జరిగిన ఘటనపై కేంద్రానికి వివరించారు. స్వయంగా రంగంలోకి దిగి, వరద పరిస్థితిని సమీక్షించినట్లు ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోందని, ఔట్ ఫ్లో సైతం అదే స్థాయిలో ఉందని, సమీప ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: ఏపీకి 40 పవర్ బోట్లు, 10 NDRF టీమ్స్, 10 హెలికాప్టర్లు - కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget