అన్వేషించండి

Hyderabad - Vijayawada Route: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ లు ఇవే

Heavy Rains In Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణాలు వద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Heavy Rains In Telugu States  : రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కుడుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అనేక ప్రాంతాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని మార్గాల గుండా ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు.

తెలంగాణలోని కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతికి జాతీయ రహదారిపై నీరు భారీగా చేరింది. దీంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకిని గూడెం వద్ద పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోందని ఆయన వెల్లడించారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్పీ వెల్లడించారు. 

హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ లు..

హైదరాబాద్ - విజయవాడ 

హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌-చిట్యాల- నార్కట్‌పల్లి- నల్గొండ- మిర్యాలగూడ- పిడుగురాళ్ల- గుంటూరు- విజయవాడ వెళ్లాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్ - ఖమ్మం..
 చౌటుప్పల్‌- చిట్యాల- నార్కట్‌పల్లి- అరవపల్లి- తుంగతుర్తి- మద్దిరాల- మరిపెడ మీదుగా వెళ్లాలని పోలీసుల సూచించారు.

హైవేపై అనుమతించబోము అన్న అధికారులు..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అయితవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాళ్ళ లోతులో వరద వస్తుండడంతో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కేసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద తగ్గేంతవరకు హైవేపై ఎవరిని అనుమతించబోమని నందిగామ ఆర్డీవో రవీంద్రరావు వెల్లడించారు. 


పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు..

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే 30కిపైగా రైళ్ళను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ నుంచి తిరుపతికి వెళ్లే కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ ను రాజమండ్రిలో నిలిపివేసి రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో భీమవరం మీదుగా దారి మళ్ళించారు. ట్రాకులు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేట, రాయనపాడులో ట్రాకులు తెగిపోవడంతో రైళ్ళు నిలిపివేశారు. ఆదివారం, సోమవారం కలిపి మొత్తం 80 రైళ్లు రద్దు చేయగా, మరో 48 రైళ్లను దారి మళ్ళించారు. హైదరాబాద్ - విజయవాడ రూట్ లోనే అత్యధిక రైళ్లు రద్దు అయ్యాయి. మరోవైపు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 
Also Read: Chandrababu: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు, ఫోన్లోనే బాలయ్యకు విషెస్

అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి టీజీ భరత్

సుంకేసుల డ్యాం భద్రతపై కర్నూలు జిల్లా అధికారులను మంత్రి టీజీ భరత్ అప్రమత్తం చేశారు. సుంకేసుల డ్యామ్ వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కుంగిన ఘటనపై అధికారులతో మంత్రి మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రజలెవరు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా మంత్రి కోరారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలను తీసుకుందని మంత్రి వెల్లడించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అందుబాటులో ఉందని, విపత్తు నిర్వహణ పనులను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget