అన్వేషించండి

YSRCP News: కౌంటింగ్‌లో కుట్రలు, అక్రమాలు చేసైనా కూటమి గెలిచే అవకాశం!: సజ్జల రామకృష్ణారెడ్డి

AP Exit Poll 2024: ప్రత్యర్థి కూటమి నేతలు అక్రమాలు, కుట్రలు చేసైనా ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తారని, వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

YSRCP leader Sajjala Ramakrishna Reddy : తాడేపల్లి: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, అక్రమాలు చేసైనా గెలిచేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తారని సజ్జల ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలు, పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీసినా, ధైర్యంగా పోరాడాలి కానీ సంయమనం కోల్పోవద్దని సజ్జల వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ ఏజెంట్లతో సజ్జల జూమ్ మీటింగ్  
జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రూల్స్ ప్రకారం వైసీపీకి పడిన ప్రతిఓటు మనకు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సమయంలో కూటమి నేతలు, కార్యకర్తలు కుట్రలకు వెనుకాడరు. అయినా సంయమనంగా ఉండి, ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కుట్రలు, అక్రమాలు చేసైనా కూటమి గెలుస్తుందని’ సజ్జల సంచలన ఆరోపణలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్‌పై ఏమైనా అనుమానుం వస్తే కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇంకా అవసరమైతే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని, వరుసగా రెండోసారి జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో స్థానికంగా ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి. కానీ రాష్ట్రం గురించి అవగాహనా లేని కొన్ని నేషనల్‌ మీడియా సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. ఒడిశాలో బీజేడీకి 0 సీట్లు ఇచ్చారు, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చినట్లు ప్రజలు గుర్తించారన్నారు. 

అన్ని పార్టీలు కలవడంతో భారీ సౌండ్ వచ్చింది!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి బీజేపీ పంచన చేరారు. అంతా ఏకమై సీఎం జగన్‌ను ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారని, అయినా మేం పేదల కోసం పని చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఏకం కావడంతో సౌండ్ పెద్దగా వచ్చింది. దాంతో ఎన్నికల కమిషన్ పై సైతం ఒత్తిడి పెంచి రాష్ట్రంలో మార్పులు చేర్పులు జరిగాయా అని అనుమానాలు కలిగినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామన్నారు. అన్ని పార్టీలు కలవడంతో కౌంటింగ్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. ఫీల్డ్ లో వచ్చిన ఫలితాల కంటే జూన్ 4న ఓట్ల లెక్కింపులో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు వచ్చినవారు ఏపీలో జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయడం శుభపరిణామం. ప్రజల తీర్పు ఈవీఎంలో ఉంది, కౌంటింగ్ లో భారీ మెజార్టీతో వైసీపీ అఖండ విజయం సాధించే ఛాన్స్ ఉందన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget