అన్వేషించండి

YSRCP News: కౌంటింగ్‌లో కుట్రలు, అక్రమాలు చేసైనా కూటమి గెలిచే అవకాశం!: సజ్జల రామకృష్ణారెడ్డి

AP Exit Poll 2024: ప్రత్యర్థి కూటమి నేతలు అక్రమాలు, కుట్రలు చేసైనా ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తారని, వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

YSRCP leader Sajjala Ramakrishna Reddy : తాడేపల్లి: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, అక్రమాలు చేసైనా గెలిచేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తారని సజ్జల ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలు, పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీసినా, ధైర్యంగా పోరాడాలి కానీ సంయమనం కోల్పోవద్దని సజ్జల వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ ఏజెంట్లతో సజ్జల జూమ్ మీటింగ్  
జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రూల్స్ ప్రకారం వైసీపీకి పడిన ప్రతిఓటు మనకు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సమయంలో కూటమి నేతలు, కార్యకర్తలు కుట్రలకు వెనుకాడరు. అయినా సంయమనంగా ఉండి, ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కుట్రలు, అక్రమాలు చేసైనా కూటమి గెలుస్తుందని’ సజ్జల సంచలన ఆరోపణలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్‌పై ఏమైనా అనుమానుం వస్తే కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇంకా అవసరమైతే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని, వరుసగా రెండోసారి జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో స్థానికంగా ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి. కానీ రాష్ట్రం గురించి అవగాహనా లేని కొన్ని నేషనల్‌ మీడియా సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. ఒడిశాలో బీజేడీకి 0 సీట్లు ఇచ్చారు, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చినట్లు ప్రజలు గుర్తించారన్నారు. 

అన్ని పార్టీలు కలవడంతో భారీ సౌండ్ వచ్చింది!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి బీజేపీ పంచన చేరారు. అంతా ఏకమై సీఎం జగన్‌ను ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారని, అయినా మేం పేదల కోసం పని చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఏకం కావడంతో సౌండ్ పెద్దగా వచ్చింది. దాంతో ఎన్నికల కమిషన్ పై సైతం ఒత్తిడి పెంచి రాష్ట్రంలో మార్పులు చేర్పులు జరిగాయా అని అనుమానాలు కలిగినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామన్నారు. అన్ని పార్టీలు కలవడంతో కౌంటింగ్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. ఫీల్డ్ లో వచ్చిన ఫలితాల కంటే జూన్ 4న ఓట్ల లెక్కింపులో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు వచ్చినవారు ఏపీలో జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయడం శుభపరిణామం. ప్రజల తీర్పు ఈవీఎంలో ఉంది, కౌంటింగ్ లో భారీ మెజార్టీతో వైసీపీ అఖండ విజయం సాధించే ఛాన్స్ ఉందన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget