అన్వేషించండి

నోరు తెరవండీ- అసంతృప్త నేతలకు వైసీపీ హైకమాండ్ ఆదేశం!

వైఎస్ఆర్ సీపీలో ఉన్న ఆ ఎమ్మెల్యేలంతా మాట్లాడాల్సిందేనని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందట. లేదంటే క్యాడర్‌కు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్దం కాకపోతే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని తెగేసి చెప్పారట.

ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త తరహా రాజకీయం కనిపిస్తోంది. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. వరుసగా పార్టీలో విభేదాలు బహిర్గతం కావటం, నెల్లూరు వంటి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో సైతం అసంతృప్తు స్వరాలు పెరగడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యిందని చెబుతున్నారు. దీంట్లో భాగంగా శాసన సభ్యులు అసంతృప్తులుగా ప్రచారం జరుగుతున్న చోట్ల పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. అలాంటి శాసన సభ్యులు ఇప్పటికే పలుమార్లు పార్టీ అగ్రనేతలను కలసి పూర్తి తమ వివరణ ఇచ్చారు. అంతే కాదు తమ ఇబ్బందులను కూడా నాయకత్వానికి వివరించారు. 

అధికార పార్టీ శాసన సభ్యులు అసంతృప్తి పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని క్యాడర్‌కు కూడా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది అధిష్ఠానం. ప్రతిపక్షానికి కూడా అవకాశాలు చేతిలో పెట్టినట్లు అవుతుందని అంచనా వేస్తోంది. అలాంటి నేతలందరికీ విషయంలో ఓ కీలకమయిన ఆదేశం జారీ చేసిందట అధినాయకత్వం. 

ఫలాన శాసన సభ్యుడు అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుందని పార్టీ అగ్రనాయకత్వానికి తెలిసిందంటే చాలు ఆయా ఎమ్మెల్యేలంతా నెలకు ఒకసారి అయినా ప్రెస్‌మీట్ పెట్టి, వాస్తవాలను గురించి వివరించాలని ఆదేశాలు ఇచ్చిందట. సో ఆయా శాసన సభ్యులు అంతా ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ పార్టీ గురించి చెబుతారట. 

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడు కొలుసు పార్థసారధి గతంలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణలో పదవి రాకపోవటంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది. పార్టీ నేతలతోపాటుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా అహనంతో పార్టీలో ఉంటున్నారని, కార్యకలాపాలకు కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం ఉంది. ఇటీవల పార్థసారథి తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు కేపీ.రెడ్డయ్య చనిపోయారు. దీంతో సీఎం జగన్ ఆయన ఇంటికి వెళ్లి రెడ్డయ్యకు నివాళర్పించారు. తర్వాత పార్టీ నుంచి వెళ్లి ఆదేశాల మేరకు ఆయన విజయవాడ కేంద్రంగా మీడియా సమావేశం నిర్వహించి మరీ జగన్ గురించి ఠముకేశారు. సామాజిక వర్గాలకు న్యాయం చేసింది జగన్ మాత్రమేనని పదే పదే నొక్కి చెప్పారు. అయితే సందర్బంలో లేకుండా ఉన్నపళంగా మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటని మీడియా అడిగితే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

వసంతది కూడా అదే పరిస్థితి

ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌ది కూడా అదే తీరు. మంత్రి జోగి రమేష్‌తో విభేదాలు కారణంగా దూరంగా ఉంటున్న వసంత కూడా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ బాటలోనే నడుస్తానని ఆయన గతంలో కూడా పదే పదే వివరించారు. అయితే మంత్రి జోగితో మాత్రం విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని తెగేసి చెప్పేశారు.

వెలంపల్లి-సామినేని ఎపిసోడ్ లో 

ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందని శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ్యుడు సామినేని ఉదయ భాను వ్యవహరంలో కూడా ఇదే జరిగింది. గత జనవరి నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నగర అద్యక్షుడు బొప్పన భువ కుమార్ జన్మదిన వేడుకల్లో వెలంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయ భాను ఘర్షణ పడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తుండగానే ఇద్దరు శాసన సభ్యులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లారు. చివరకు మరో ఇద్దరు శాసన సభ్యులు కలసి వారిని పక్కకు తీసుకువెళ్ళారు. ఈ వ్యవహరం పార్టీలో తీవ్ర దుమారాన్ని రాజేసింది. పార్టీకి జిల్లా అద్యక్షుడిగా కొనసాగుతున్న వెలంపల్లి, మరో సీనియర్ శాసన సభ్యుడిని దూషించటం, రాజకీయంగా చర్చనీయాశంకావటం, అందులో కూడా కులాల ప్రస్తావన రావటంతో, పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దుర్గ గుడి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయ భాను పక్క పక్కనే కుర్చొబెట్టి విభేదాలు లేవనే సందేశాన్ని పంపించారు. 

ఇలా వరుసగా వివాదాలు ఉన్న శాసన సభ్యులతో మీడియా సమావేశాలు పెట్టించటంతోపాటుగా నేతల మధ్య గ్యాప్ ఉంటే వాటిని వారి చేతనే సరిదిద్దించే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పార్టిలో ప్రచారం జరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
YCP 11th number Room: అమ్మో 11వ నెంబర్ - పార్లమెంట్‌లో రూం మార్చేసుకున్న వైసీపీ ఎంపీలు - ఎందుకో తెలుసా?
అమ్మో 11వ నెంబర్ - పార్లమెంట్‌లో రూం మార్చేసుకున్న వైసీపీ ఎంపీలు - ఎందుకో తెలుసా?
Vijayawada Terror Links: విజయవాడలో ఉగ్ర కుట్ర భగ్నం- ముగ్గురు యువకుల అరెస్టు.. ఐసిస్, ఆఖిస్‌లతో సంబంధాలు?
విజయవాడలో ఉగ్ర కుట్ర భగ్నం- ముగ్గురు యువకుల అరెస్టు.. ఐసిస్, ఆఖిస్‌లతో సంబంధాలు?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Embed widget