అన్వేషించండి

Attack On TDP Office: కాకినాడలో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడి

టీడీపీ నేతలు కొండబాబు, నవీన్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వైసీపీ నేతలు, మత్స్యకారులు ఒక్కసారిగా దాడికి దిగారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు దేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడలోని జిల్లా టీడీపీ ఆఫీసును వైఎస్సార్ సీపీ శ్రేణులు, మత్స్యకారులు ముట్టడించే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు  కొండబాబు, నవీన్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వైసీపీ నేతలు, మత్స్యకారులు ఒక్కసారిగా దాడికి దిగారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి మద్దతుదారులు, మత్స్యకారులు, బోటు నిర్వాహకులు టీడీపీ నేతలపై దాడి చేశారని నేతలు ఆరోపించారు.

ఇటీవల అగ్నిప్రమాదం సంభవించి బోటు కాలిపోయిన బోటులో హెరాయిన్  ఉందని పట్టాభి ఆరోపించడం వివాదానికి కారణమైంది. మాజీ మంత్రి చినరాజప్ప, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డ్రగ్స్ దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. డ్రగ్స్ దిగుమతి చేస్తున్న క్రమంలోనే బోటు దగ్ధమైందని పట్టాభిరామ్ ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపట్టలేదని, రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. 

Also Read: "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం ! 

హెరాయిన్‌తో బోటు ప్రమాదానికి లింక్..
బోటులో జరిగిన అగ్రిప్రమాదాన్ని డ్రగ్స్ అక్రమ రవాణాకు ముడిపెడుతూ పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు. అయితే బోట్ ప్రమాదాన్ని హెరాయిన్ స్మగ్లింగ్‌తో ముడి పెట్టడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాకినాడ పోర్టులో టీడీపీ నేతల టీమ్ పర్యటించి తూర్పు గోదావరి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, మత్స్యకారులు జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టాభిరామ్ సహా టీడీపీ నేతలు పార్టీ ఆఫీసు నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తూ పెద్దగా నినాదాలు చేశారు. జ్యోతుల నవీన్, కొండబాబు పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వారిపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు, బోటు నిర్వాహకులు దాడికి యత్నించారు.

Also Read: ఇంటి నుంచే సంపాదన పేరుతో మోసం.. రూ.11 కోట్లు స్వాహా.. ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు..

జ్యోతుల నెహ్రూ జోక్యంతో సద్దుమణిగిన వివాదం..

వైఎస్సార్ సీపీ శ్రేణులు, బోటు నిర్వాహకుల దాడితో అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు కొండబాబు, నవీన్‌ను పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్లారు. మరోవైపు పట్టాభిరామ్ మాత్రం బయటకు రాకుండా ఆఫీసులో ఉండిపోయారు. తమకు డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాతో సంబంధం అంటకట్టిన పట్టాభిరామ్ పై బోటు నిర్వాహకులు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్ ప్రమాదంపై పట్టాభి  వ్యాఖ్యలు తప్పుగా భావిస్తే వాటిని ఉపసంహిరంచుకుంటున్నామని  నిమ్మకాయల చినరాజప్ప సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పట్టాభి తమకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ వారు ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసుల రక్షణ కల్పించి పట్టాభిరామ్‌ను ఎస్కార్ట్‌తో సురక్షితంగా ఇంటికి తరలించారు.

Also Read: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget