YS Jagan: పులివెందులకు వైఎస్ జగన్, రేపటి నుంచి 3 రోజులు అక్కడే
AP News: ఆగస్టు 31 నుంచి మూడు రోజుల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. తన నివాసంలోనే పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు.

YS Jagan Pulivendula Tour: వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి (ఆగస్టు 31) వచ్చే 3 రోజులు జగన్ పులివెందులలోనే పర్యటించనున్నారు. తన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, పార్టీ కార్యకర్తలను కలవనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం తాడేపల్లి ఇంటి నుంచి వైఎస్ జగన్ 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్కి చేరుకోనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుస్తారు. అనంతరం పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన పార్టీ మండల అధ్యక్షుడు అయిన మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
ఆ తర్వాత అదే మండలంలోని గొందిపల్లికి చేరుకుని మరో వైసీపీ నేత ఇంటికి జగన్ వెళ్లనున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కూతురు అశారెడ్డి - శివారెడ్డి దంపతులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రానికి పులివెందులలోని తన నివాసానికి జగన్ చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Before You Go
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















