అన్వేషించండి

YS Jagan Delhi Tour: ముగిసిన ఢిల్లీ పర్యటన - మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకోనున్న ఏపీ సీఎం జగన్, సాయంత్రం గవర్నర్‌తో భేటీ

YS Jagan Completes Delhi Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఒక్కరోజు పర్యటన ముగించుకుని నేడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. సాయంత్రం గవర్నర్‌తో సీఎం జగన్ కీలక భేటీ కానున్నారు.

YS Jagan Delhi Tour: అమరావతి: ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఒక్కరోజు పర్యటన ముగించుకుని నేడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అనంతరం ఉదయం 9.30 కు ఢిల్లీ నుంచి సీఎం జగన్ ఏపీకి బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు.. 

సాయంత్రం గవర్నర్‌తో సీఎం జగన్ కీలక భేటీ
బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసంలో కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు. నేటి సాయంత్రం 5.30 కు రాజ్ భవన్ లో గవర్నర్‌తో సీఎం కీలక భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ మార్పులపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. మంత్రుల రాజీనామాలు, కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు ఆయన సమర్పించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 11 న కొలువుదీరనున్న ఏపీ కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించనున్నారు.

ప్రధానితో సీఎం జగన్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)తో ఏపీ సీఎం మంగళవారం భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు వీరి మధ్య భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక పరమైన సాయం కోసం ప్రత్యేకంగా ప్రధానిని జగన్ అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని మరోసారి ప్రధానిని జగన్కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించిందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్ర మంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు..
ప్రధాని మోదీతో భేటీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. మొదటగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala Seetaraman)తో సమావేశమయ్యారు. రెవెన్యూ గ్యాప్‌ భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు, కార్యక్రమాలకు ఖర్చు చేసిన రూ.32,625.25 కోట్లను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి, ఇప్పుడు ఆ రుణపరిమితుల్లో కోత విధించడం సరికాదన్నారు. దీన్ని వెంటనే సవరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram)కు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖమంత్రితో సీఎం చర్చించారు. 

కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్‌(Gajendra Singh Shekhawat)తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్థారించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. కాంపొనెంట్‌ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు.

Also Read: Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ 

Also Read: CM Jagan meets Union Ministers: గత ప్రభుత్వం హయంలో అలా చేసి ఇప్పుడెందుకు కోతలు- సరి చేయాలని కేంద్రమంత్రులకు సీఎం జగన్ విజ్ఞప్తి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Embed widget