అన్వేషించండి

Kapu Ramachandra Reddy : బీజేపీలో చేరేందుకు కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నం - విజయవాడలో రాజ్‌నాథ్‌ను కలిసే ప్రయత్నాలు విఫలం !

Kapu Ramachandra Reddy : బీజేపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్‌తో భేటీకి ప్రయత్నించి విఫలమయ్యారు.

YCP MLA Kapu Ramachandra Reddy tried to join BJP :  వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విజయవాడలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరు అయిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు. ఆయన విజయవాడ పర్యటనకు రావడంతో.. కాపు రామచంద్రారెడ్డి విజయవాడలో ఆయన బస చేసిన హోటల్ వద్దకు వెళ్లారు. అయితే ఆయనను అనుమతించలేదని తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడి వచ్చారు.   రాజనాథ్ సింగ్ ను కలిసేందుకే వచ్చాననని..  మా జిల్లాకు సంబంధం లేని మీటింగ్ ఇక్కడ జరుగుతుంది.. అందుకే మీటింగ్ లో నుంచి బయటికి వచ్చేశానని మీడియాతో చెప్పారు. 

ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరాలో పూర్తి గా ఏ నిర్ణయం తీసుకోలేదని.. స్పష్టం చేశారు. కానీ   వైసిపి ని పూర్తిగా వదిలేశాను... ఆ పార్టీ తో నాకు సంబంధం లేదన్నారు.  వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నానని..  ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానన్నారు. మంగళగిరిలో జరుగుతున్న వైసిపి మీటింగ్ నుంచి నాకు ఎటువంటి సమాచారం లేదని..  రాజ్ నాధ్ సింగ్  ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానన్నారు.  త్వరలోనే అన్ని‌విషయాలు వివరిస్తానని..  ఆ తరువాత రాష్ట్రం లో పరిస్థితులు పై మాట్లాడతానని చెప్పుకొచ్చారు.              

కాపు రామచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ లోచేరాలని  అనుకున్నారు. మడకశిర వెళ్లి రఘువీరారెడ్డితో సమావేసం అయ్యారు.  రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి, తన భార్య కాపు భారతి రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీలో ఉంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నా.. మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారు.  వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాపు రామచంద్ర రెడ్డికి  వైఎస్ జగన్ కూడా పలుమార్లు టిక్కెట్ ఇచ్చారు.   వైఎస్ఆర్సిపీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రామచంద్ర రెడ్డి కి టికెట్ ఇవ్వటం కుదరదు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలపడంతో కాపు రామచంద్ర రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.                    

తాడేపల్లి సీఎంవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసుకు సెల్యూట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో టిక్కెట్ ఇచ్చినా చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై పెద్దగా ఆసక్తి చూపించ లేదు. బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున పోటీ చేయవచ్చన్న ఆలోచనతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ బీజేపీ నేతలు ఆయనను  పట్టించుకోలేదు.                                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jaisalmer Bus Fire: జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Andhra Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
Haryana News: హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య -  ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య - ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
Advertisement

వీడియోలు

Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Ind vs WI 2nd Test | బౌండరీ లైన్ దగ్గర బర్గర్ తింటూ కూర్చొన్న ఈ స్టార్ట్ బ్యాటర్ ఎవరో గుర్తుపట్టారా? | ABP Desam
Ind vs Wi Mohammad Siraj | విండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్‌కి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ సిరీజ్ | ABP Desam
Harman Preet Kaur | వన్డే వరల్డ్ కప్ 2025లో హర్మన్ కెప్టెన్సీ, ఫామ్‌పై పెరుగుతున్న విమర్శలు | ABP Desam
Rohit Sharma vs Gautam Gambhir । రోహిత్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన గంభీర్ | AbBP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jaisalmer Bus Fire: జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Andhra Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
Haryana News: హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య -  ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య - ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
EPFO 100 Percent Withdraw:  EPFO నుంచి 100 శాతం డబ్బును ఒకేసారి ఎలా విత్‌డ్రా చేయవచ్చు? చాలా సులభమైన మార్గం తెలుసుకోండి!
EPFO నుంచి 100 శాతం డబ్బును ఒకేసారి ఎలా విత్‌డ్రా చేయవచ్చు? చాలా సులభమైన మార్గం తెలుసుకోండి!
RBI Offline Digital Rupee: డిజిటల్ రూపాయి యాప్ వచ్చేసింది! ఇంటర్‌నెట్ లేకపోయినా చెల్లింపు చేయొచ్చు!
డిజిటల్ రూపాయి యాప్ వచ్చేసింది! ఇంటర్‌నెట్ లేకపోయినా చెల్లింపు చేయొచ్చు!
Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌ను షేక్ చేస్తున్న దివ్వెల మాధురి ! అల్లాడిపోతున్న సభ్యులు 
బిగ్‌బాస్‌ హౌస్‌ను షేక్ చేస్తున్న దివ్వెల మాధురి ! అల్లాడిపోతున్న సభ్యులు 
Virat Kohli : కొత్త లుక్‌లో 'కింగ్ కోహ్లీ'- విరాట్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా
కొత్త లుక్‌లో 'కింగ్ కోహ్లీ'- విరాట్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా
Embed widget