అన్వేషించండి

Anantapuram Politics : ఇద్దరు మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుల దారెటు ? - అనంతపురం రాజకీయాల్లో సీనియర్లకు చోటు లేదా ?

అనంతపురం జిల్లాలో ఆ ఇద్దరు నేతలు ఎటు వైపు ? రఘువీరారెడ్డి, శైలజానాథ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ?


Anantapuram Politics :  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి పెరుగుతూండటంతో సీనియర్ నేతలపై అందరి దృష్టి పడింది. అనంతపురం జిల్లాలో ఇద్దరు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉన్నారు. వారు ఏ పార్టలో చేరుతారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే వారు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు. అందుకే వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. కానీ వారు మాత్రం గుంభనంగానే రాజకీయాలు చక్క బెడుతున్నారు.  

సైలెంట్ గానే ఉన్న రఘువీరారెడ్డి 
 
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా దెబ్బతింది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు  రఘువీరారెడ్డి ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోియంది.  2014, 2019 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గంలోనూ ఆయన పోటీ చేసినప్పటికీ కాంగ్రెసుపై ఉన్న వ్యతిరేకతతో ఓటమిని చవిచూడక తప్పలేదు. 2019 ఎన్నికల తరువాత నుంచి పిసిసి పదవి నుంచి కూడా తప్పుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు పార్టీ తరపున అక్కడ ప్రచారం చేశారు. తిరిగి ఆయన యాక్టివ్‌ అయ్యారని భావించారు. కాని ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల పట్ల మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు అయినా ఇక్కడి రాజకీయాల వైపు దృష్టి సారిస్తారా లేక దూరంగానే ఉంటారా అన్నది క్లారిటీ లేదు. 

మరో పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ దారెటు ? 

 రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షతల నుంచి తప్పుకున్న తరువాత మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజనాథ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2004లో వైద్యవృత్తిని వదిలి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2012లో కాంగ్రెసు పార్టీ హయంలోనే విద్యా శాఖ మంత్రి అయ్యారు.  మొన్నటి వరకు ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. కాని ఇటీవల ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. అప్పటి నుంచి ఆయన కొంత వరకు కాంగ్రెసుకు దూరంగా జరుగుతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదన్న ఉద్ధేశంతో ఇతర పార్టీల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పూర్వపు నియోజకవర్గమైన శింగనమలలో ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం! 

శింగనమల నియోజకవర్గంలో తనకు ఉన్న పరిచయాలతో ముఖ్యమైన వారిని గ్రామాల వారీగా కలుస్తూ, వచ్చే ఎన్నికల్లో తనకు సహకారం అందివ్వాలని కోరుతున్నారు. అయితే ఏ పార్టీ తరపున అన్నది స్పష్టంగా వారికి మాత్రం చెప్పడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి త్వరలో చేరే అవకాశముందన్నది మాత్రం ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల కాలంలో ఆయన ఆ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారన్న ప్రచారమూ ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని చెక్‌ పెట్టేందుకు ఆయన్ను తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనలోనూ తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget