అన్వేషించండి

Vizianagaram: రామతీర్థం రాములోరి లోగిట్లో రాజకీయ రచ్చ... ప్రోటోకాల్ పాటించలేదని అశోక్ గజపతిరాజు ఆగ్రహం.. సర్కస్ కంపెనీ అంటారా అని మంత్రులు మండిపాటు

రామతీర్థం రాములోరి గుడి నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరుగుతుంటే సర్కస్ కంపెనీ అంటారా అని మంత్రులు మండిపడ్డారు.

విజయనగరం జిల్లా బోడికొండపై రామతీర్థం రాములోరి గుడి శంకుస్థాపన బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం శంకుస్థాపన చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ చర్చించకుండా ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. శిలాఫలకంపై పేర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై మండిపడ్డారు. ఆ శిలాఫలకాన్ని తోసివేసేందుకు ప్రయత్నించిన అశోక్ గజపతిరాజును అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అధికారులు అశోక్​కు మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. అనంతరం కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ అక్కడకు వచ్చారు. దేవదాయశాఖ ఆనవాయితీని వైసీపీ ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు, బోర్డులను గౌరవించే పరిస్థితి వైసీపీ సర్కారుకు లేదని విమర్శించారు. 

Also Read: రేపట్నుంచి సీఎం జగన్ కడప జిల్లా టూర్... ఈ నెల 25న పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు

సర్కస్ కంపెనీ అంటారా?

రామతీర్థం కోదండ రాముడి గుడి శంకుస్థాపన చేస్తుంటే సర్కస్ కంపెనీ అని మాట్లాడతారా అని అశోక్‌ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఆలయ నిర్మాణం ఇష్టం లేకే అశోక్ గజపతిరాజు గొడవ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రామతీర్థం ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఆలయ ధర్మకర్త ఉన్న అశోక్ గజపతిరాజును గౌరవంగా ఆహ్వానించామన్నారు. రామతీర్థం ఆలయంలో విగ్రహాల ధ్వంసంపై విచారణ జరుగుతుంటే అశోక్ గజపతిరాజు కంగారు పడుతున్నారన్నారని వెల్లంపల్లి ఆరోపించారు. రాష్ట్రంలో 25 వేల దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రామతీర్థంలోని ఆలయం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఆహ్వానించారని మంత్రి తెలిపారు. ప్రోటోకాల్‌ ప్రకారం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని,కానీ అశోక్‌ గజపతిరాజు కావాలని గొడవ చేశారని మండిపడ్డారు. శిలాఫలకాన్ని నెట్టేసి ప్రభుత్వం ఒక సర్కస్‌ కంపెనీ అని విమర్శలు చేశారని వెల్లంపల్లి అన్నారు. 

Also Read: అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు అన్నీ సీసాలోకి ఎక్కిం చేస్తాడు 

అశోక్ గజపతిరాజుకు వచ్చిన నష్టమేంటి? 

రామతీర్థంలో అశోక్ గజపతిరాజు అహంభావంతో వ్యవహరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రామతీర్థాన్ని రెండో భద్రాచలంగా తీర్చిదిద్దుతుంటే అశోక్ గజపతిరాజుకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ఆలయం అభివృద్ధిని పట్టించుకోకపోబట్టే ప్రభుత్వం రామతీర్థం ఆలయానికి రూ. 3 కోట్లు వెచ్చిస్తుందన్నారు. రామతీర్థం ఆలయ అభివృద్ధికి మాన్సాస్‌ నుంచి ఎందుకు నిధులు ఖర్చు పెట్టడంలేదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నామని బొత్స పేర్కొన్నారు.

Also Read: నెల్లూరులో భారీ స్కామ్, అసలు వాహనాలే లేవు.. అయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఎలా జరిగిందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget