Vizag to Tirupati Trains: విశాఖ నుండి తిరుపతి, చర్లపల్లి కి స్పెషల్ ట్రైన్స్.. డేట్స్ ఎప్పుడంటే
vizag to charlapalli special trains | విశాఖ నుండి తిరుపతి, చర్లపల్లి కి స్పెషల్ ట్రైన్స్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 2 నెలలపాటు ప్రత్యేక రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనుంది.

vizag to Tirupati special trains | విశాఖపట్నం: ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో వస్తున్న వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం నుండి తిరుపతి, చర్లపల్లి రూట్ లలో ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది రైల్వే శాఖ. ఆ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ ప్రత్యేక రైళ్ల డీటెయిల్స్ ప్రకటించింది.
1) విశాఖపట్నం - తిరుపతి ట్రైన్
ట్రైన్ నెంబర్ 08547 విశాఖపట్నం తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ 06.08.2025 నుండి 24.09.2025 వరకూ నడవబోతోంది. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరే ఈ ట్రైన్ గురువారం ఉదయం 9:15 కి తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం రాత్రి 09:50 కి తిరుపతిలో బయలుదేరే ప్రత్యేక రైల్ (08548) శుక్రవారం ఉదయం 11:30 కు వైజాగ్ రీచ్ అవుతుంది.
స్థాప్స్ :
వైజాగ్ -తిరుపతి మధ్య ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ లలో ఆగుతుంది.
కోచ్ పొజిషన్స్ :
రెండు సెకండ్ ఏసి, మూడు 3AC, మూడు 3AC ఎకానమీ, ఎనిమిది స్లీపర్ క్లాస్, 4 జనరల్ కోచ్ లు, ఒక లగేజి కమ్ దివ్యాంగుల కోచ్ ఉంటాయి
2) వైజాగ్-చర్లపల్లి ట్రైన్
ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ 08.08.2025 నుండి 26.09.2025 వరకూ నడవబోతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరే ఈ ట్రైన్ శనివారం ఉదయం 8గంటలకు కి చర్లపల్లి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం 03:30 కి చర్లపల్లి లో లో బయలుదేరే ప్రత్యేక రైల్ (08580) ఆదివారం ఉదయం 7:00 గంటలకు వైజాగ్ రీచ్ అవుతుంది.
స్థాప్స్ :
వైజాగ్ -చర్లపల్లి మధ్య ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్,ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.
కోచ్ పొజిషన్స్ : రెండు సెకండ్ ఏసి, మూడు 3AC, రెండు 3AC ఎకానమీ, ఎనిమిది స్లీపర్ క్లాస్, 4 జనరల్ కోచ్ లు, ఒక లగేజి కమ్ దివ్యాంగుల కోచ్ ఉంటాయి
నిజానికి ఈ రైళ్లు ప్రస్తుతం నడుస్తూనే ఉన్నా పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రెండు నెలలపాటు పొడిగించినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ K. సందీప్ తెలిపారు.





















