News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gudivada Amarnath: అచ్యుతాపురం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం

Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్ లో సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

FOLLOW US: 
Share:

Achyuthapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుడివాడ తెలియజేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని సాయంత్రం అమర్నాథ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలో 35 మంది పనిచేస్తున్న సమయంలో కంటైనర్ లో సాల్వెంట్ లోడ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందన్నారు.  మంటలు చెలరేగడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వీరిలో నలుగురిని కిమ్స్ ఆస్పత్రికి, ఇద్దరిని కేజీహెచ్ కు, ఒకరిని అచ్చుతాపురం ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ ప్రమాదంలో జంగాలపాలెం చెందిన పైలా సత్తిబాబుకు 95 శాతం గాయాలై అతడు మరణించాడని, విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పాడ తిరుపతికి ఈ ప్రమాదంలో ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడని మంత్రి అమర్నాథ్ తెలిపారు. భువనేశ్వర్ కు చెందిన రామేశ్వర్, అనకాపల్లి జిల్లా రేబాకకు చెందిన సాగిరెడ్డి రాజాబాబు, నక్కపల్లికి చెందిన ఎస్. అప్పారావు, పంచదారలకు చెందిన సింగంశెట్టి నూకనాయుడు 96 గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రికి వివరించగా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. క్షతగాత్రులకు ఇంకా మెరుగైన వైద్యం కావాల్సి వస్తే ఎక్కడికైనా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కూడా ఆయన తెలియజేశారు.

జరిగిన ఘటనపై అధికారులతో సమీక్షిస్తున్నామని ఇది ఎవరి నిర్లక్ష్యమని తెలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రమాదకర పరిశ్రమలపై ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తోందని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అమర్నాథ్ అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మరిన్ని కఠిన ర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

ప్రమాదాలు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి
అచ్యుతాపురం సెజ్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ఎప్పటి కప్పుడు కంపెనీల యజమానులకు జాగ్రత్త లు తీసుకోవాలని చెబుతున్నా.. ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి అమర్ నాథ్ అన్నారు. మరోసారి అక్కడి అచ్యుతా పురం సెజ్ లోని కంపెనీలతో మాట్లాడి మరింత కఠిన మైన నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు. కేజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మిగిలిన బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ట్లు తెలిపిన ఆయన వారిలో ఒకరి పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత కేజీహెచ్ నుండి సంఘటనా స్థలానికి వెళ్ళారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 30 Jun 2023 08:10 PM (IST) Tags: Anakapalli Gudivada Amarnath Vizag Achyuthapuram Achyuthapuram SEZ Sahithi Pharma Company

ఇవి కూడా చూడండి

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు