అన్వేషించండి

Bengal Tigers: విజయనగరం ప్రజలను హడలెత్తిస్తున్న బెంగాల్‌ టైగర్స్, రెండు పులులూ జత కలిస్తే !

ఒడిశాలోని అడవుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడా పశువులపై దాడులు లేవు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ పెద్దపులి సంచరించిన దాఖలాలు లేవు. అయితే, గత ఏడాది ఏప్రిల్‌ నెలలో తొలిసారిగా రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ జిల్లాలో కనిపించింది. అదే సమయంలో పొరుగున అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా పులి దాడులు జరిగాయి. విశాఖ`విజయనగరం సరిహద్దు జిల్లాల్లోనూ పశువులపై దాడి చేశాయి.  తొలుత ఇది ఒకే పులి అని భావించినా.. తర్వాత విజయనగరం జిల్లాలో కదలికలను బట్టి రెండు పులులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒడిశాలోని అడవుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడా పశువులపై దాడులు లేవు. తాజాగా మంగళవారం రాత్రి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం పొల్లాల్లో ఆవుపై దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
పులులు రెండూ ఒకటికొకటి ఎదురుపడలేదు
రాయల్‌ బెంగాల్‌ టైగర్లలో ఒకటి ఆడది.. మరొకటి మగది. చెరోవైపు సంచరిస్తూ ఎనిమిది నెలలుగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కళ్లాల వద్ద ఆవులు, దూడలను హతమార్చుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇప్పటి వరకూ మనుషులపై దాడి చేసిన సందర్భాలు లేవు. దీనివల్లే కాస్తయినా ప్రజలు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇన్నాళ్లూ పులులు రెండూ ఒకటికొకటి ఎదురుపడలేదని అధికారులు భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. అవి రెండూ ఒక చోటకు చేరాయని అనుకుంటున్నారు. కొద్దిరోజులుగా వీటి అలికిడి లేకపోవడం, ఇది పులులు జతకట్టే కాలం కూడా కావడంతో అవి సంభోగించే అవకాశం ఉందని ఆటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే గానీ జరిగితే.. మూడున్నర నెలల కాలంలోనే రెం. డు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న స్థితిలో ఉన్న ప్రాణుల్లో రాయల్‌ బెంగాల్‌ టైగర్లు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీటి కలయిక జరిగి, పిల్లలకు జన్మనిస్తే జిల్లాకు విశేషమే. రాయల్‌ బెంగాల్‌ టైగర్లు మన రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. విశాల మైన శ్రీశైలం అభయారణ్యంలో ఒక్కో పులి 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతాన్ని తమ రాజ్యంగా భావిస్తుంటాయి.

ఒడిశా నుంచి వచ్చిందా?
పులి తొలుత కనిపించిన ఆండ్ర ఫారెస్టు ఏరియా ఒడిశా సరిహద్దుకు సమీపంలోనే ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంత గిరి మండలానికి సరిహద్దు ప్రాంతమే.  దీని తర్వాత అరకు అటవీ ప్రాంతం దాటితే ఒడిశా సరిహద్దు ఉంది. తాటిపూడి, ఆండ్ర జలాశయాల చుట్టూ విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలోనే గత ఎనిమిది నెలల్లో ఎక్కువ సార్లు పెద్దపులి సంచారం కనిపించింది. ప్రస్తుతం రెండు పులులు అనంతగిరి మండల సరిహద్దు గ్రామా లైన మూలపాడు, గూడెం, బొండపల్లి మండలంలోని పాత పనసలపాడు, మెంటాడ మండలంలోని పణుకు వానివలన గ్రామాల పరిసరాల్లోనే ఉంటున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతమంతా నాలుగైదు. కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. అక్కడే రెండు పులులు ఏకమయ్యే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. గర్భధారణ జరిగితే వంద నుంచి 110 రోజుల్లోనే పిల్లలకు జన్మనిస్తాయి.
కొత్త సంవత్సరంలో పులి అలికిడి తక్కువగానే ఉంది. దీంతో ఇటు ప్రజలు, అటు అటవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరలా ఇప్పుడు బొండపల్లి మండలంలో పశువును పొట్టన పెట్టుకోవడంతో కలవరం మొదలైంది. జిల్లాలో ఇప్పటి వరకూ పులి దాడితో 42 పశువులు మృతి చెందాయి. పశువులను నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం రూ.7.42 లక్షలను పరిహారంగా అందజేసింది. ప్రాణనష్టం మరింత పెరగక ముందే అటవీ అధికారులు పులులను పట్టుకుని అరణ్యంలోకి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
Telangana Ration Card Latest News: రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.