అన్వేషించండి

Vizianagaram Train Accident: పలాస రైల్వే గార్డు జీవితమంతా కష్టాలు, బాధ్యతలే! ఓ తల్లిలా భార్యకు సేవలు

Visakha Palasa Passenger Railway Guard News: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారిలో విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు ఎం.శ్రీనివాస్ కూడా ఉన్నారు. 

Visakhapatnam Palasa Passenger Railway Guard Dies:

ఏపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది. విశాఖ - పలాస ప్యాసింజర్ రైలును అదే లైనులో వెనుక నుంచి వచ్చి విశాఖ - రాయగడ రైలు ఢీకొట్టింది. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం కంటకాపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైలు ప్రమాదంలో 15 మంది చనిపోగా, మరో వంద మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ రైలు ఇద్దరు లోకో పైలట్లు,  విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు (Visakha Palasa Passenger Guard) ఎం.శ్రీనివాస్ ఉన్నారు. 

చిన్ననాటి నుంచే కుటుంబ భారాన్ని భుజాలపై మోస్తూ.. 
రైలు ప్రమాదంలో కోల్పోయేది కొన్ని ప్రాణాలు మాత్రమే కాదు, కొన్ని కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయేవారు ఉంటారు. అలాంటి వారిలో విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు ఎం శ్రీనివాస్ ఒకరు. అయితే తనకు జీవితాన్ని ఇచ్చిన రైల్వేశాఖలోనే విధులు నిర్వర్తిస్తూ ఆయన ప్రాణాలు విడవటంతో కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయారు. రైల్వే గార్డు శ్రీనివాస్ మరణంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైలు ప్రమాదంలో చనిపోయిన మిగతావారి జీవితాలకు రైల్వే గార్డు శ్రీనివాస్ లైఫ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చిన్న తనంలోనే తండ్రి చనిపోతే ఏడుగురున్న ఆ కుటుంబానికి ఆయన నాన్నగా మారారు. తండ్రి బాధ్యత తాను తీసుకుని కుటుంబ భారాన్ని భుజాలపై మోశాడు. అమ్మకు ఏ కష్టం రాకుండా అనునిత్యం ఆమెకు అండగా నిలిచాడు.

తల్లిలా భార్యకు సేవలు చేసిన రైల్వే గార్డు
సోదరులు, చెల్లెళ్లకు అన్నీ తానై చూసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకు తానే పెళ్లి చేశాడు. రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్లను ఓ దారికి తెచ్చేందుకు తన జీవితం చివరి క్షణం వరకు సాయం చేశాడు. తన భార్య మానసిక సమస్యతో మంచాన పడితే, తల్లిలా మారి ఆమె ఇరవై ఏళ్లుగా సేవలు చేస్తున్నాడు. జీవితంలో కష్టాలు, బాధ్యతలే తప్ప సుఖం అనే మాట ఆయనకు తెలియదని బంధువులు చెబుతున్నారు. ఆయనకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కానీ ఆయనకు జీవితాన్ని ఇచ్చిన రైల్వేశాఖలోనే గార్డుగా చివరి క్షణం వరకు సేవలు అందించాడు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయాడు. 

ప్రమాదం జరిగిన తరువాత మృతులలో విశాఖ పలాస రైల్వే గార్డు ఎం శ్రీనివాస్ ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. ఆ విషయాన్ని చెప్పడానికి సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ చేసి.. విజయనగరం జిల్లా కంటాకపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో రైల్వే గార్డు శ్రీనివాస్ చనిపోయారని సమాచారం అందించారు. జీవితాంతం కుటుంబం కోసం ఎంతగానో శ్రమించిన తమ సోదరుడు శ్రీనివాస్ ఇకలేరన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన వారికి అన్న మాత్రమే కాదు, నాన్నగా వారి జీవితాలకు దారి చూపిన గొప్ప మనసున్న వ్యక్తి. మంచి వ్యక్తిని కోల్పోయామని స్థానికులు చెబుతున్నారు.

Also Read: ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget