అన్వేషించండి

Vijayanagaram Train accident: ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ

Vijayanagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయి దర్యాప్తులో వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం కారణం కాదని స్పష్టం చేశారు. విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ సిగ్నల్ గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని వెల్లడించారు. అయితే, ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టడమంటే రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని, అసలు ఆ రైలుకు సిగ్నల్ ఎవరిచ్చారనే నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ జరిగింది 

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్ పై ఉన్న విశాఖ - పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖ - రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి పలాస ప్యాసింజర్ సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరగా, అదే ట్రాక్ పై రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది.  పలాస ప్యాసింజర్ కంటకాపల్లి - అలమండ వద్దకు రాగానే సిగ్నల్ కోసం నెమ్మదిగా వెళ్తూ 848 కి.మీ వద్ద ట్రాక్ పై నిలిచింది. ఆ సమయంలో వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడే మరో ట్రాక్ పై ఉన్న గూడ్స్ రైలుపైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ట్యాంకర్ గూడ్స్ పైకి పలాస రైలుకు చెందిన 2 బోగీలు వెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లింది. విశాఖ - రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీలు పట్టాలు తప్పి పొలాల్లో పడిపోయాయి. దాని వెనుక ఉన్న డీ - 1 బోగీ వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను ఇంకా వెలికితీస్తున్నారు. పలాస, రాయగడ ప్యాసింజర్ రైలులో మొత్తం 1400 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

అదే అంతిచిక్కని ప్రశ్న

విశాఖ నుంచి పలాస ప్యాసింజర్ ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుకనే రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. ఇంతలో విజయనగరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య కారణంగానే అది నెమ్మదిగా వెళ్లిందని, ఇంతలోనే రాయగడ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రయాణీకులు చెబుతున్నారు. ఒకే ట్రాక్ లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది అంతుపట్టడం లేదని ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించిన ఓ రైల్వే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తన 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం ఇదే తొలిసారని చెప్పారు. 

పాఠాలు నేర్వలేదా.?

ఈ ఏడాది జూన్ లో ఒడిశా, బాలాసోర్ జిల్లాలోని బహనగా స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో రైలు ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కోరమాండల్ బోగీలు పట్టాలు తప్పగా, ఆ పక్కనే ట్రాక్ పై వెళ్తున్న యశ్వంత్ పూర్ - హౌరా సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పగా, 275 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే సిగ్నల్ తప్పిదమే ప్రమాదానికి కారణంగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సరిగ్గా, విజయనగరం రైలు ప్రమాదం సమయంలోనే సేమ్ సీన్ రిపీట్ అయింది. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగిన పలాస ప్యాసింజర్ ను, రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టగా, పక్కన ఉన్న గూడ్స్ రైలుపైకి పట్టాలు దూసుకెళ్లాయి. 

Also Read: రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి - ఇతర మృతుల వివరాలివే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget