అన్వేషించండి

YSR View Point: జోష్‌లో కూటమి అభిమానులు- YSR వ్యూ పాయింట్‌ని మళ్లీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా మార్పు!

YSR View Point name changed: సీతకొండలోని వైఎస్సార్ వ్యూ పాయింట్ ని మళ్లీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా పేరు మార్చేశారు. వైసీపీ ఓటమితో కూటమి అభిమానులు వైఎస్సార్ పేరుపై అబ్దుల్ కలాం పేరు అతికించారు.

Abdul Kalam View Point:  విశాఖ: ఏపీలోని విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న సీత కొండపై ఉన్న వైఎస్ఆర్ వ్యూ పాయింట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సీత కొండలో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను తిరిగి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా మార్చేశారు. గతంలో ఇది అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ కాగా, వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చింది. అయితే ఏపీలో మంగళవారం ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా, గెలుపు జోష్ లో ఉన్న కూటమి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వ్యూ పాయింట్‌ వద్ద వైఎస్సార్ పేరు స్థానంలో అబ్దుల్ కలాం పేరు స్టిక్కర్ అతికించారు. గతంలో వైఎస్సార్ వ్యూ పాయింట్ గా పేరు మార్చడాన్ని వ్యతిరేకించిన వాళ్లు ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో ఈ పని చేసి ఉంటారు.


YSR View Point: జోష్‌లో కూటమి అభిమానులు- YSR వ్యూ పాయింట్‌ని మళ్లీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా మార్పు!

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గత ఏడాది సీత కొండ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చగా, ఆ సమయంలో వివాదం చెలరేగింది. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనేమైనా శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, ఏపీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు, నచ్చిన చోట తమకు కావాల్సినట్లుగా పేర్లు మార్చుతున్నారంటూ అప్పట్లోనే సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSR View Point: జోష్‌లో కూటమి అభిమానులు- YSR వ్యూ పాయింట్‌ని మళ్లీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా మార్పు!

గతంలో చంద్రబాబు రియాక్షన్ ఇదీ.. 
మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడం బాధాకరం అని గతంలో చంద్రబాబు అన్నారు. ఆ పేరు తీసేయడం అంటే అబ్దుల్ కలాంను అవమానించడమేనని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. స్టిక్కర్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, ఏ పని జరిగినా వాటికి సీఎం జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అదే సమయంలో విమర్శలు గుప్పించారు.

టీడీపీ, బీజేపీ నేతల విమర్శలు, ఆరోపణలపై అప్పటి ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. సీతకొండ వ్యూ పాయింట్ ను డెవలప్ చేసిన అనంతరం, అధికారుల పర్మిషన్‌తో వైఎస్సార్ వ్యూ పాయింట్ గా నామకరణం చేసినట్లు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పేర్కొంది. గతంలో ఆ ఏరియాను ఎవరూ డెవలప్ చేయలేదని, అక్కడ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనే పేరు అధికారంగా పెట్టలేదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అయితే తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందగా, అదేరోజు వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడాన్ని గతంలో వ్యతిరేకించిన కూటమి అభిమానులు తిరిగి అబ్దుల్ కలాం పేరు కనిపించేలా వ్యూ పాయింట్ వద్ద స్టిక్కర్లు అతికించినట్లు తెలుస్తోంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget