అన్వేషించండి

గంగవరం పోర్టు యాజమాన్యం అబద్దాలకు హద్దులేదా?

విశాఖస్టీల్‌ప్లాంట్‌చెల్లింపులుఆలస్యమైనప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌కుసక్రమంగాదిగుమతులను అందించామని ఆగస్ట్ 5వతేదీపోర్టుయాజమాన్యంచేసినప్రకటనఅవాస్తవమని విశాఖ ఉక్కు పరిరక్షణపోరాట కమిటీ ఛైర్మన్‌ నరసింగరావు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ చెల్లింపులు ఆలస్యమైనప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌కు సక్రమంగా దిగుమతులను అందించామని ఆగస్ట్ 5 వ తేదీని పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటన అవాస్తవమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ నరసింగరావు ఆరోపించారు. అదానీ గ్రూప్ యాజమాన్యానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎటువంటి శ్రద్ద లేదని ప్రకటని చేయడం హాస్యస్పాదమని ఆయన అన్నారు. యూనియన్‌ లపై పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

గంగవరం పోర్టులో జులై చివరి వారంలో 3 రోజులు వెయ్యి కోట్ల విలువైన కోకింగ్ కోల్‌ ను అమెరికా, ఆస్ట్రేలియా నుంచి జులై 12 వ తేదీన వచ్చిన 3 షిప్‌ లను 24 గంటల్లో బెర్త్‌ ఇవ్వాల్సి ఉండగా 18 వ తేదీ వరకు గంగవరం పోర్టు బెర్త్ లకు రాకుండా పోర్టులోనే ఆపిన విషయం పై దేశమంతా భగ్గుమందని ఈ సందర్భంగా చైర్మన్‌ గుర్తు చేశారు. కానీ పోర్టు యాజమాన్యం మాత్రం స్టీల్‌ ప్లాంట్‌ దిగుమతులు సక్రమంగా చేసినట్లు నంగనాచి కబుర్లు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ద్వారానే గంగపోర్టు అత్యధిక లాభాలతో నడుస్తున్నట్లు వారు తెలిపారు. గంగవరం పోర్టు గోడను దాటగానే స్టీల్ ప్లాంట్‌ ఉన్నా ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున పెంచుతూ విపరీతమైన ఛార్జీలు స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వసూళ్లు చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.

గంగవరం పోర్టు పాత యాజమాన్యం డీవీఎస్ కస్సోర్సీయంతో చేసిన దిగుమతులు టారిఫ్ ను కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్‌ ప్లాంట్‌ పై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా పెంచిందని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై మోపిన అదనపు భారాన్ని తగ్గించాలి. పాత టారిఫ్‌ ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

దక్షిణ కొరియా ఫోస్కో కంపెనీ, అదానీ గ్రూప్‌ కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు 2017 నుంచి ప్రారంభించారనడానికి పూర్తి ఆధారాలున్నాయి. 2018 లో అప్పటి స్టీల్ శాఖ మంత్రి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములను గంగవరం పోర్టు వైపు ఉన్న 2 వేల ఎకరాలను కేటాయించే విషయాన్ని పరిశీలించారని నరసింగ రావు తెలిపారు. 


సీఐటీయూ ఈ ఆధారాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని సవాల్‌ చేసిన తరువాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇప్పటి వరకు నిశ్శబ్దాన్ని నటించారు. కానీ గంగవరం పోర్టును అదానీ గ్రూప్‌ స్వాధీనం చేసుకున్న తరువాత తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారని తెలుస్తుంది.   కేంద్ర ప్రభుత్వం ఒక వైపున విశాఖ స్టీల్‌ కార్మికులు, అధికారులకు వేతన ఒప్పందం 1-1-2017 నుంచి అమలు చేయలేదని పేర్కొన్నారు.

 ప్రమోషన్‌లు లేవు. కానీ దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు వేతన ఒప్పందం చేసి వారికి బకాయిలు కూడా సంవత్సరం క్రితమే చెల్లించారు. గత 4సంవత్సరాల్లో సుమారు 4వేల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు రిటైర్డ్ అయినప్పటికీ కూడా కొత్తగా ఒక్కరిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. ప్రాణాలు తెగించి పనిచేసే వారిపై కేంద్రప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.  మరోవైపున రూ. 1800 కోట్లతో రైళ్ళువీల్‌ ప్లాంట్‌, ఒరిస్సా మైనింగ్‌ కార్పొరేషన్‌ కొనుగోలు పేరుతో సుమారు రూ. 1000కోట్లు ఒక్క టన్నుకూడా నేటికి రాకుండా నిధులు కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని నరసింగరావు పేర్కొన్నారు. 

గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు లాభాలు వస్తే విశాఖ స్టీల్‌లో 40% ఉత్పత్తి తగ్గించి రూ.  3,900కోట్లు నష్టాలు తెప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేట్‌ చేయడానికి మోడీ, అదానీ చేస్తున్న కుట్ర ఇది అని వారు విమర్శిచారు.   అదానీ గ్రూప్‌కు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఆసక్తి లేదని తేలిగ్గా అబద్దాలు ఆడడం సరికాదని పేర్కొన్నారు. 

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోని గర్భంలో ఉన్న మాంగనీస్ గనులు, సరిపల్లి వద్ద ఉన్న ఇసుక గనులు, అనకాపల్లిలో కింతాడ వద్ద ఉన్న క్వార్ట్జ్‌ గనుల లీజులు ప్రతి సంవత్సరం ఆటోమేటిక్‌ గా రెన్యువల్‌ జరగాల్సి ఉన్నప్పటికీ రెన్యూవల్‌ పొడిగించకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దీని వలన కంపెనీ పై అదనపు భారం పడుతున్నది. తక్షణమే లీజలును రెన్యువల్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMB Classic Dolby: అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Embed widget